ధోఫర్‌లో 70 వేల మొక్కలు నాటే ప్రాజెక్టు ప్రారంభం

- September 15, 2022 , by Maagulf
ధోఫర్‌లో 70 వేల మొక్కలు నాటే ప్రాజెక్టు ప్రారంభం

సలాలా: దోఫర్ గవర్నరేట్‌లోని వివిధ విలాయాత్‌లలో 70,000 చెట్లను పెంచే ప్రాజెక్ట్‌తో ముందుకు పోతున్నట్లు ఎన్విరాన్‌మెంట్ అథారిటీ (EA) ప్రకటించింది. జాతీయ స్థాయిలో చేపట్టిన 10 మిలియన్ల చెట్లను నాటే ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు అథారిటీ తెలిపింది. పర్యావరణ పరిరక్షణ డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ మహమ్మద్ సలీమ్ అల్ హర్దన్ మాట్లాడుతూ..  ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోని సైట్లలో కూడా చెట్లను నాటుతున్నట్లు తెలిపారు. ధోఫర్ గవర్నరేట్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 9,278 చెట్లను నాటినట్లు అల్ హర్దన్ పేర్కొన్నారు. గ్రీన్ కవర్‌ను మెరుగుపరచే లక్ష్యంగా తాజా ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com