ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే.. 1,000 దిర్హామ్ల జరిమానా
- September 16, 2022
యూఏఈ: ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే వాహనదారులకు భారీ జరిమానా విధిస్తామని షార్జా పోలీస్ జనరల్ కమాండ్ హెచ్చరించింది. ప్రయాణికులు తమ భద్రతతోపాటు ఇతరుల భద్రతను కాపాడాలని పిలుపునిచ్చింది. ముఖ్యంగా చిన్నపాటి మరమ్మతులు, ప్రమాదాలు జరిగిన సమయంలో తమ వాహనాలను రోడ్డు పైనుంచి తీసి సమీపంలోని సేఫ్ పాయింట్ వద్ద నిలపాలని ట్రాఫిక్, పెట్రోల్స్ డిపార్ట్మెంట్ హెడ్ మేజర్ అబ్దుల్లా అల్ మంధారి తెలిపారు. చిన్న ట్రాఫిక్ ప్రమాదాల సమయంలో కొంతమంది వాహనదారులు రోడ్డు మధ్యలో తమ వాహనాలను ఆపివేయడం వల్ల ఇతర వాహనదారుల భద్రతకు హాని కలిగిస్తుందన్నారు. ప్రమాద సంఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ పెట్రోలింగ్ల వచ్చే వరకు ఆగకుండా వెంటనే వాహనాలను రోడ్డుపైనుంచి తీసేందుకు ప్రయత్నించాలని వాహనదారులకు ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో గుమిగూడవద్దని వాహనదారులకు అల్ మంధారి పిలుపునిచ్చారు. ఇది ప్రమాదాన్ని పెంచడంతోపాటు ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తుందన్నారు. ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ నంబర్ (74) ప్రకారం.. ప్రమాదాల సమయంలో ట్రాఫిక్కు (సేకరణ) అడ్డుగా ఉండే వాహన యజమానులకు 1,000 Dhs జరిమానా విధిస్తారని అల్ మంధారి తెలిపారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







