ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే.. 1,000 దిర్హామ్ల జరిమానా
- September 16, 2022
యూఏఈ: ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే వాహనదారులకు భారీ జరిమానా విధిస్తామని షార్జా పోలీస్ జనరల్ కమాండ్ హెచ్చరించింది. ప్రయాణికులు తమ భద్రతతోపాటు ఇతరుల భద్రతను కాపాడాలని పిలుపునిచ్చింది. ముఖ్యంగా చిన్నపాటి మరమ్మతులు, ప్రమాదాలు జరిగిన సమయంలో తమ వాహనాలను రోడ్డు పైనుంచి తీసి సమీపంలోని సేఫ్ పాయింట్ వద్ద నిలపాలని ట్రాఫిక్, పెట్రోల్స్ డిపార్ట్మెంట్ హెడ్ మేజర్ అబ్దుల్లా అల్ మంధారి తెలిపారు. చిన్న ట్రాఫిక్ ప్రమాదాల సమయంలో కొంతమంది వాహనదారులు రోడ్డు మధ్యలో తమ వాహనాలను ఆపివేయడం వల్ల ఇతర వాహనదారుల భద్రతకు హాని కలిగిస్తుందన్నారు. ప్రమాద సంఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ పెట్రోలింగ్ల వచ్చే వరకు ఆగకుండా వెంటనే వాహనాలను రోడ్డుపైనుంచి తీసేందుకు ప్రయత్నించాలని వాహనదారులకు ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో గుమిగూడవద్దని వాహనదారులకు అల్ మంధారి పిలుపునిచ్చారు. ఇది ప్రమాదాన్ని పెంచడంతోపాటు ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తుందన్నారు. ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ నంబర్ (74) ప్రకారం.. ప్రమాదాల సమయంలో ట్రాఫిక్కు (సేకరణ) అడ్డుగా ఉండే వాహన యజమానులకు 1,000 Dhs జరిమానా విధిస్తారని అల్ మంధారి తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







