సంజయ్ షా ను డెన్మార్క్ కు అప్పగించేందుకు అనుమతివ్వాలని దుబాయ్ కోర్టు ను కోరిన అటార్నీ జనరల్
- September 16, 2022
దుబాయ్ : పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ కేసులో దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేసిన డానిష్ జాతీయుడు సంజయ్ షా ను ఆ దేశానికి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని అటార్నీ జనరల్ దుబాయ్ కోర్టు ను అభ్యర్థించారు. డెన్మార్క్ లో పన్ను ల ఎగవేతకు పాల్పడిన సంజయ్ షా దేశం నుంచి పారిపోయి దుబాయ్ చేరుకున్నారు. ఐతే డానిష్ పోలీసుల విజ్ఞప్తి మేరకు దుబాయ్ పోలీసులు అతన్ని దుబాయ్ లో అరెస్ట్ చేశారు. నేరస్తుల అప్పగింత లో భాగంగా సంజయ్ షా ను డెన్మార్క్ కు అప్పగించాల్సి ఉంది. ఐతే దుబాయి కోర్టు మాత్రం ఈ అప్పగింతకు నో చెప్పింది. దీంతో అంతర్జాతీయంగా పరస్పర సహకారం కోసం డెన్మార్క్ కు సంజయ్ షా ను అప్పగించే విషయంలో సానుకూలంగా స్పందించాలని దుబాయ్ ప్రభుత్వం కోర్టును కోరింది. అటార్నీ జనరల్ ఎస్సాం ఇస్సా అల్ హుమేదన్ స్వయంగా ఈ విషయంలో కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు ఈ విషయంలో మరోసారి విచారణ జరపనుంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్









