సంజయ్ షా ను డెన్మార్క్ కు అప్పగించేందుకు అనుమతివ్వాలని దుబాయ్ కోర్టు ను కోరిన అటార్నీ జనరల్
- September 16, 2022
దుబాయ్ : పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ కేసులో దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేసిన డానిష్ జాతీయుడు సంజయ్ షా ను ఆ దేశానికి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని అటార్నీ జనరల్ దుబాయ్ కోర్టు ను అభ్యర్థించారు. డెన్మార్క్ లో పన్ను ల ఎగవేతకు పాల్పడిన సంజయ్ షా దేశం నుంచి పారిపోయి దుబాయ్ చేరుకున్నారు. ఐతే డానిష్ పోలీసుల విజ్ఞప్తి మేరకు దుబాయ్ పోలీసులు అతన్ని దుబాయ్ లో అరెస్ట్ చేశారు. నేరస్తుల అప్పగింత లో భాగంగా సంజయ్ షా ను డెన్మార్క్ కు అప్పగించాల్సి ఉంది. ఐతే దుబాయి కోర్టు మాత్రం ఈ అప్పగింతకు నో చెప్పింది. దీంతో అంతర్జాతీయంగా పరస్పర సహకారం కోసం డెన్మార్క్ కు సంజయ్ షా ను అప్పగించే విషయంలో సానుకూలంగా స్పందించాలని దుబాయ్ ప్రభుత్వం కోర్టును కోరింది. అటార్నీ జనరల్ ఎస్సాం ఇస్సా అల్ హుమేదన్ స్వయంగా ఈ విషయంలో కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు ఈ విషయంలో మరోసారి విచారణ జరపనుంది.
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







