సంజయ్ షా ను డెన్మార్క్ కు అప్పగించేందుకు అనుమతివ్వాలని దుబాయ్ కోర్టు ను కోరిన అటార్నీ జనరల్
- September 16, 2022
దుబాయ్ : పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ కేసులో దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేసిన డానిష్ జాతీయుడు సంజయ్ షా ను ఆ దేశానికి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని అటార్నీ జనరల్ దుబాయ్ కోర్టు ను అభ్యర్థించారు. డెన్మార్క్ లో పన్ను ల ఎగవేతకు పాల్పడిన సంజయ్ షా దేశం నుంచి పారిపోయి దుబాయ్ చేరుకున్నారు. ఐతే డానిష్ పోలీసుల విజ్ఞప్తి మేరకు దుబాయ్ పోలీసులు అతన్ని దుబాయ్ లో అరెస్ట్ చేశారు. నేరస్తుల అప్పగింత లో భాగంగా సంజయ్ షా ను డెన్మార్క్ కు అప్పగించాల్సి ఉంది. ఐతే దుబాయి కోర్టు మాత్రం ఈ అప్పగింతకు నో చెప్పింది. దీంతో అంతర్జాతీయంగా పరస్పర సహకారం కోసం డెన్మార్క్ కు సంజయ్ షా ను అప్పగించే విషయంలో సానుకూలంగా స్పందించాలని దుబాయ్ ప్రభుత్వం కోర్టును కోరింది. అటార్నీ జనరల్ ఎస్సాం ఇస్సా అల్ హుమేదన్ స్వయంగా ఈ విషయంలో కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు ఈ విషయంలో మరోసారి విచారణ జరపనుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







