సంజయ్ షా ను డెన్మార్క్ కు అప్పగించేందుకు అనుమతివ్వాలని దుబాయ్ కోర్టు ను కోరిన అటార్నీ జనరల్
- September 16, 2022
దుబాయ్ : పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ కేసులో దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేసిన డానిష్ జాతీయుడు సంజయ్ షా ను ఆ దేశానికి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని అటార్నీ జనరల్ దుబాయ్ కోర్టు ను అభ్యర్థించారు. డెన్మార్క్ లో పన్ను ల ఎగవేతకు పాల్పడిన సంజయ్ షా దేశం నుంచి పారిపోయి దుబాయ్ చేరుకున్నారు. ఐతే డానిష్ పోలీసుల విజ్ఞప్తి మేరకు దుబాయ్ పోలీసులు అతన్ని దుబాయ్ లో అరెస్ట్ చేశారు. నేరస్తుల అప్పగింత లో భాగంగా సంజయ్ షా ను డెన్మార్క్ కు అప్పగించాల్సి ఉంది. ఐతే దుబాయి కోర్టు మాత్రం ఈ అప్పగింతకు నో చెప్పింది. దీంతో అంతర్జాతీయంగా పరస్పర సహకారం కోసం డెన్మార్క్ కు సంజయ్ షా ను అప్పగించే విషయంలో సానుకూలంగా స్పందించాలని దుబాయ్ ప్రభుత్వం కోర్టును కోరింది. అటార్నీ జనరల్ ఎస్సాం ఇస్సా అల్ హుమేదన్ స్వయంగా ఈ విషయంలో కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు ఈ విషయంలో మరోసారి విచారణ జరపనుంది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









