సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం.. యూఏఈ పోలీసుల హెచ్చరిక
- September 17, 2022
యూఏఈ: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలలో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఒకటని అబుధాబి పోలీసులు తెలిపారు. స్మార్ట్ఫోన్ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలను పోలీసులు మరోసారి వాహనదారులకు గుర్తు చేశారు. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక అవగాహన వీడియోను షేర్ చేశారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఎమిరేట్లోని 100,000 కంటే ఎక్కువ మంది డ్రైవర్లు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారని పేర్కొంది. నిబంధనల ప్రకారం వారికి Dh800 జరిమానాతోపాటు నాలుగు బ్లాక్ పాయింట్లను విధించినట్లు పోలీసులు తెలిపారు. ఎమిరేట్ రోడ్లపై ఉన్న హై-టెక్ రాడార్లు సెల్ ఫోన్ డ్రైవింగ్ ను గుర్తించగలవని, అధునాతన సిస్టమ్లతో కూడిన స్మార్ట్ పెట్రోలింగ్ కూడా ట్రాఫిక్ ఉల్లంఘలను పర్యవేక్షిస్తాయన్నారు. అబుధాబి పోలీస్లోని ట్రాఫిక్ డైరెక్టరేట్ డైరెక్టర్ మేజ్ మొహమ్మద్ దహి అల్ హుమిరి గతంలో మాట్లాడుతూ.. చాలా మంది ఫోన్లలో మాట్లాడటం లేదా మెసేజ్ లు పంపుతూ పట్టుబడ్డారని చెప్పారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొందరు సోషల్ మీడియాలో చాట్ చేయడం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, ఫోటోలు తీయడం లేదా వీడియోలు షూట్ చేయడం వంటివి చేస్తూ.. ట్రాఫిక్ చట్టాన్ని నిర్మొహమాటంగా ఉల్లంఘిస్తున్నరని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!









