తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
- September 18, 2022
హైదరాబాద్: తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, బైంసా, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) సోదాలు చేస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న కార్యకలాపాలపై, ఉగ్రమూలాలున్నాయన్న సమాచారంతో ఎన్ఐఏ అధికారులు వివరాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులోని నిందితులు, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. నిజామాబాద్ లోని 20 ప్రాంతాల్లో నాలుగు ఎన్ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి.
మరో వైపు నిర్మల్ జిల్లా భైంసాలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మదీనా కాలనీలో పలు ఇళ్లలో కొందరిని అధికారులు విచారిస్తున్నారు. జగిత్యాలలో మూడు ఇళ్లు, టవర్ సర్కిల్ లోని కేర్ మెడికల్, టీఆర్ నగర్లో ఒక ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. అధికారులు ఇప్పటికే పలు డైరీలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఖాజానగర్లో ఇలియాజ్ తో పాటు అతడి స్నేహితుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మతకలహాలు సృష్టించేందుకు కొందరు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









