తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
- September 18, 2022
హైదరాబాద్: తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, బైంసా, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) సోదాలు చేస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న కార్యకలాపాలపై, ఉగ్రమూలాలున్నాయన్న సమాచారంతో ఎన్ఐఏ అధికారులు వివరాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులోని నిందితులు, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. నిజామాబాద్ లోని 20 ప్రాంతాల్లో నాలుగు ఎన్ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి.
మరో వైపు నిర్మల్ జిల్లా భైంసాలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మదీనా కాలనీలో పలు ఇళ్లలో కొందరిని అధికారులు విచారిస్తున్నారు. జగిత్యాలలో మూడు ఇళ్లు, టవర్ సర్కిల్ లోని కేర్ మెడికల్, టీఆర్ నగర్లో ఒక ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. అధికారులు ఇప్పటికే పలు డైరీలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఖాజానగర్లో ఇలియాజ్ తో పాటు అతడి స్నేహితుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మతకలహాలు సృష్టించేందుకు కొందరు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!







