ట్రాఫిక్ ప్రమాదం తర్వాత వాహనాన్ని ఆపడానికి విఫలమైతే 20,000 దిర్హామ్ల జరిమానా
- September 18, 2022
యూఏఈ: యూఏఈలో ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ట్రాఫిక్ నిబంధనలు బ్రేక్ చేస్తే మాత్రం అంతే సంగతులు.భారీ జరిమానాలు, కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది.ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అనుసరించే యూఏఈ ట్రాఫిక్ పోలీస్ విభాగం తాజాగా మరో కొత్త ప్రపొజల్ను అమలు చేసే విషయమై పబ్లిక్ ప్రాసిక్యూషన్ను సంప్రదించింది.ఎవరైనా వాహనదారులు యాక్సిడెంట్ చేసిన తర్వాత ప్రమాదస్థలి నుంచి తప్పించుకుంటే.. అది కూడా బాధితులకు తీవ్ర గాయాలైన సందర్భంలో.
దీంతో ఇక పై ఇలాంటి సందర్భాల్లో వాహనదారుడికి 20వేల దిర్హాములు వరకు జరిమానా విధించవచ్చని ప్రాసిక్యూషన్ పేర్కొంది.ఈ మేరకు తాజాగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక ప్రకటన విడుదల చేసింది. "ప్రమాదానికి కాణమైన వాహనదారుడు.. బాధితులకు గాయాలైన సందర్భంలో పట్టించుకోకుండా ప్రమాదస్థలి నుంచి తప్పించుకుంటే 20వేల దిర్హామ్ల జరిమానా ఉంటుంది. అలాగే ప్రమాద తీవ్రతను బట్టి వాహనదారుడు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది" అని హెచ్చరించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన 1995లో తీసుకొచ్చిన ఫెడరల్ చట్టం నం. 21లోని ఆర్టికల్-49లో గల క్లాజ్-5 ప్రకారం ఈ జరిమానా విధించడం జరుగుతుందని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







