ట్రాఫిక్ ప్రమాదం తర్వాత వాహనాన్ని ఆపడానికి విఫలమైతే 20,000 దిర్హామ్ల జరిమానా
- September 18, 2022
యూఏఈ: యూఏఈలో ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ట్రాఫిక్ నిబంధనలు బ్రేక్ చేస్తే మాత్రం అంతే సంగతులు.భారీ జరిమానాలు, కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది.ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అనుసరించే యూఏఈ ట్రాఫిక్ పోలీస్ విభాగం తాజాగా మరో కొత్త ప్రపొజల్ను అమలు చేసే విషయమై పబ్లిక్ ప్రాసిక్యూషన్ను సంప్రదించింది.ఎవరైనా వాహనదారులు యాక్సిడెంట్ చేసిన తర్వాత ప్రమాదస్థలి నుంచి తప్పించుకుంటే.. అది కూడా బాధితులకు తీవ్ర గాయాలైన సందర్భంలో.
దీంతో ఇక పై ఇలాంటి సందర్భాల్లో వాహనదారుడికి 20వేల దిర్హాములు వరకు జరిమానా విధించవచ్చని ప్రాసిక్యూషన్ పేర్కొంది.ఈ మేరకు తాజాగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక ప్రకటన విడుదల చేసింది. "ప్రమాదానికి కాణమైన వాహనదారుడు.. బాధితులకు గాయాలైన సందర్భంలో పట్టించుకోకుండా ప్రమాదస్థలి నుంచి తప్పించుకుంటే 20వేల దిర్హామ్ల జరిమానా ఉంటుంది. అలాగే ప్రమాద తీవ్రతను బట్టి వాహనదారుడు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది" అని హెచ్చరించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన 1995లో తీసుకొచ్చిన ఫెడరల్ చట్టం నం. 21లోని ఆర్టికల్-49లో గల క్లాజ్-5 ప్రకారం ఈ జరిమానా విధించడం జరుగుతుందని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









