మెట్రో మరియు లుసైల్ ట్రైన్ డిజైన్ల ఆవిష్కణ
- April 17, 2016
ఖతార్ రైల్వేస్ కంపెనీ (ఖతార్ రైల్) దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ వెహికిల్స్ డిజైన్లను ఆవిష్కరించింది. 2020 నాటికి ఈ ప్రాజెక్ట్ సాకారం కానుంది. ఖతారి సంస్కృతి అలాగే మోడర్న్ టెక్నాలజీ కలగలిసి అల్ పరాస్ (దోహా మెట్రో కోసం), అల్ మెహ్మెల్ (లుసైల్ ట్రామ్ కోసం) రైల్వే వెహికిల్స్ ఎక్స్టీరియర్ డిజైన్స్ని రూపొందించారు. దోహా మెట్రో కోసం రూపొందించిన రైల్ డైనమిక్ షేప్కి అల్ ఫరాస్ అని పేరు పెట్టారు. ఇది డ్రైవర్ లెస్ ట్రైన్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే డ్రైవర్ లెస్ మెట్రో రైల్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. గంటకు 100 కిలోమీటర్ల వేగం ఈ డ్రైవర్ లెస్ మెట్రో రైల్ ప్రత్యేకత. పెరల్ ఫిషింగ్ బోట్ 'ధో'ని గుర్తు చేసేలా 'అల్ మెహమిల్'ని డిజైన్ చేశారు. ఖతార్ రైల్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ సుబైయీ మాట్లాడుతూ, సంప్రదాయ మరియు ఆధునికత కలగలిసి ఈ డిజైన్లను రూపొంచామని చెప్పారు. 75 ట్రైన్లు, ఒక్కోదాంట్లో మూడు కార్స్ ఉంటాయి. వీటిల్లో గోల్డ్, ప్యామిలీ క్లాస్, స్టాండర్డ్ క్లాస్లను ఏర్పాటు చేస్తున్నారు. గోల్డ్లో 16 సీట్లు, ఫ్యామిలీలో 26 సీట్లు, స్టాండర్డ్లో 88 సీట్లు ఉంటాయి. కినికి షార్యో కంపెనీ ఒసాకా, జపాన్లో ఈ మెట్రో రైళ్ళను డిజైన్ చేసి, తయారు చేస్తుంది. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లతోపాటు, లో ఫ్లోరింగ్ కోచ్లు వీటి ప్రత్యేకత.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









