మెట్రో మరియు లుసైల్ ట్రైన్ డిజైన్ల ఆవిష్కణ
- April 17, 2016
ఖతార్ రైల్వేస్ కంపెనీ (ఖతార్ రైల్) దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ వెహికిల్స్ డిజైన్లను ఆవిష్కరించింది. 2020 నాటికి ఈ ప్రాజెక్ట్ సాకారం కానుంది. ఖతారి సంస్కృతి అలాగే మోడర్న్ టెక్నాలజీ కలగలిసి అల్ పరాస్ (దోహా మెట్రో కోసం), అల్ మెహ్మెల్ (లుసైల్ ట్రామ్ కోసం) రైల్వే వెహికిల్స్ ఎక్స్టీరియర్ డిజైన్స్ని రూపొందించారు. దోహా మెట్రో కోసం రూపొందించిన రైల్ డైనమిక్ షేప్కి అల్ ఫరాస్ అని పేరు పెట్టారు. ఇది డ్రైవర్ లెస్ ట్రైన్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే డ్రైవర్ లెస్ మెట్రో రైల్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. గంటకు 100 కిలోమీటర్ల వేగం ఈ డ్రైవర్ లెస్ మెట్రో రైల్ ప్రత్యేకత. పెరల్ ఫిషింగ్ బోట్ 'ధో'ని గుర్తు చేసేలా 'అల్ మెహమిల్'ని డిజైన్ చేశారు. ఖతార్ రైల్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ సుబైయీ మాట్లాడుతూ, సంప్రదాయ మరియు ఆధునికత కలగలిసి ఈ డిజైన్లను రూపొంచామని చెప్పారు. 75 ట్రైన్లు, ఒక్కోదాంట్లో మూడు కార్స్ ఉంటాయి. వీటిల్లో గోల్డ్, ప్యామిలీ క్లాస్, స్టాండర్డ్ క్లాస్లను ఏర్పాటు చేస్తున్నారు. గోల్డ్లో 16 సీట్లు, ఫ్యామిలీలో 26 సీట్లు, స్టాండర్డ్లో 88 సీట్లు ఉంటాయి. కినికి షార్యో కంపెనీ ఒసాకా, జపాన్లో ఈ మెట్రో రైళ్ళను డిజైన్ చేసి, తయారు చేస్తుంది. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లతోపాటు, లో ఫ్లోరింగ్ కోచ్లు వీటి ప్రత్యేకత.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







