ఇరాన్లో 31 మంది మృతి
- September 23, 2022
టెహ్రాన్: హిజాబ్ విషయమై మహిళల నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. నిరసనకారులను అణచివేసేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వేర్వేరుచోట్ల భద్రతా దళాల తూటాలకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిరసనకారుల ఆగ్రహం కట్టలు తెగి పలుచోట్ల పోలీస్ స్టేషన్లను తగులబెట్టారు. నిరసనల వీడియోలు వైరల్ అవుతుండటంతో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వినియోగంపై ఆంక్షలు విధించింది. ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, యూట్యూబ్పై గత ఏడాది నుంచే నిషేధం అమలులో ఉంది. హిజాబ్ సక్రమంగా ధరించలేదంటూ గత వారం మహ్సా అమిని (22) అనే యువతి మొరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకుని హింసించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో భగ్గుమన్న నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ‘హిజాబ్ మాకొద్దు... స్వేచ్ఛా, సమానత్వం కావాలి’ అని నినదిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీలు చేస్తున్నారు.
జుట్టు కత్తిరించుకుంటూ, స్కార్ఫ్లు తగులబెడుతూ చేస్తున్న ఆందోళనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిరసనలు 30 నగరాలకు వ్యాపించాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో నిరసనకారులను అరెస్టు చేశారు. ఇక, ఐక్యరాజ్య సమితి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ ఇరాన్లో హక్కుల కోసం పోరాడుతున్న మహిళల వెంట నిలబడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







