భార్య గౌరవాన్ని దెబ్బతీసినందుకు Dhs5,000 చెల్లించాలి: ఫ్యామిలీ కోర్టు
- September 24, 2022
అబుధాబి: తన భార్యను కొట్టి అవమానించినందుకు పరిహారంగా Dhs5,000 చెల్లించాలని ఓ భర్తను అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కేసుల కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తనను కొట్టి, అవమానించాడని అందుకు పరిహారంగా Dhs 50,000 చెల్లించేలా తన భర్తను ఆదేశించాలని ఓ భార్య కోర్టును ఆశ్రయించింది. కానీ, తన భార్య వాదనల్లో వాస్తవం లేదని భర్త ఖండించాడు. ఆమె తన నుంచి విడాకులు పొందేందుకు ఈ విధంగా కేసు వేసిందని ఆరోపించాడు. అయితే, తన భార్య గౌరవాన్ని దెబ్బతీసినందుకు భర్తను కోర్టు దోషిగా నిర్ధారించింది. పరిహారంగా ఆమెకు Dhs5,000 చెల్లించాలని, దీనితోపాటు కోర్టు ఖర్చులను చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన







