భార్య గౌరవాన్ని దెబ్బతీసినందుకు Dhs5,000 చెల్లించాలి: ఫ్యామిలీ కోర్టు
- September 24, 2022అబుధాబి: తన భార్యను కొట్టి అవమానించినందుకు పరిహారంగా Dhs5,000 చెల్లించాలని ఓ భర్తను అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కేసుల కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తనను కొట్టి, అవమానించాడని అందుకు పరిహారంగా Dhs 50,000 చెల్లించేలా తన భర్తను ఆదేశించాలని ఓ భార్య కోర్టును ఆశ్రయించింది. కానీ, తన భార్య వాదనల్లో వాస్తవం లేదని భర్త ఖండించాడు. ఆమె తన నుంచి విడాకులు పొందేందుకు ఈ విధంగా కేసు వేసిందని ఆరోపించాడు. అయితే, తన భార్య గౌరవాన్ని దెబ్బతీసినందుకు భర్తను కోర్టు దోషిగా నిర్ధారించింది. పరిహారంగా ఆమెకు Dhs5,000 చెల్లించాలని, దీనితోపాటు కోర్టు ఖర్చులను చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- నేటి నుంచి టోల్ ఛార్జీలు పెంపు
- నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన NATS
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం
- అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
- ట్రాఫిక్ జరిమానాల పై డ్రైవర్లకు 50% తగ్గింపు
- ట్రావెల్ బ్యాన్..5 దశల్లో ఆన్లైన్లో తొలగింపు ఇలా..!
- మహిళలకు NATS ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ
- దమాన్ హెల్త్ ఇన్సూరెన్స్..పెరగనున్న ప్రీమియం..!
- సౌదీ ఆదాయంలో 7.3% వృద్ధి
- అబుదాబి విమానాశ్రయంలో తగ్గిన పార్కింగ్ ఫీజులు