భార్య గౌరవాన్ని దెబ్బతీసినందుకు Dhs5,000 చెల్లించాలి: ఫ్యామిలీ కోర్టు
- September 24, 2022
అబుధాబి: తన భార్యను కొట్టి అవమానించినందుకు పరిహారంగా Dhs5,000 చెల్లించాలని ఓ భర్తను అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కేసుల కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తనను కొట్టి, అవమానించాడని అందుకు పరిహారంగా Dhs 50,000 చెల్లించేలా తన భర్తను ఆదేశించాలని ఓ భార్య కోర్టును ఆశ్రయించింది. కానీ, తన భార్య వాదనల్లో వాస్తవం లేదని భర్త ఖండించాడు. ఆమె తన నుంచి విడాకులు పొందేందుకు ఈ విధంగా కేసు వేసిందని ఆరోపించాడు. అయితే, తన భార్య గౌరవాన్ని దెబ్బతీసినందుకు భర్తను కోర్టు దోషిగా నిర్ధారించింది. పరిహారంగా ఆమెకు Dhs5,000 చెల్లించాలని, దీనితోపాటు కోర్టు ఖర్చులను చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







