భార్య గౌరవాన్ని దెబ్బతీసినందుకు Dhs5,000 చెల్లించాలి: ఫ్యామిలీ కోర్టు
- September 24, 2022
అబుధాబి: తన భార్యను కొట్టి అవమానించినందుకు పరిహారంగా Dhs5,000 చెల్లించాలని ఓ భర్తను అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కేసుల కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తనను కొట్టి, అవమానించాడని అందుకు పరిహారంగా Dhs 50,000 చెల్లించేలా తన భర్తను ఆదేశించాలని ఓ భార్య కోర్టును ఆశ్రయించింది. కానీ, తన భార్య వాదనల్లో వాస్తవం లేదని భర్త ఖండించాడు. ఆమె తన నుంచి విడాకులు పొందేందుకు ఈ విధంగా కేసు వేసిందని ఆరోపించాడు. అయితే, తన భార్య గౌరవాన్ని దెబ్బతీసినందుకు భర్తను కోర్టు దోషిగా నిర్ధారించింది. పరిహారంగా ఆమెకు Dhs5,000 చెల్లించాలని, దీనితోపాటు కోర్టు ఖర్చులను చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









