భారత రాయబారితో బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ కార్యదర్శి మీటింగ్
- September 26, 2022
మనామా : బహ్రెయిన్ లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవతో బహ్రెయిన్ పాస్ పోర్ట్, రెసిడెన్సీ, ఇంటీరియర్ వ్యవహారాల శాఖ కార్యదర్శి షేక్ హేషమ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు, పలు రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలను చర్చించారు. రెండు దేశాలు మరింత మెరుగైన సంబంధాల కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. బహ్రెయిన్ లో భారతీయుల సమస్యలు, పాస్ పోర్ట్ అంశాలు, రెసిడెన్షియల్ వ్యవహారాలను భారత రాయబారి ప్రస్తావించారు. ఈ అంశంలో మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందన్నారు. భారత్ తో సంబంధాల విషయంలో అత్యంత ప్రాధాన్యమిస్తున్న బహ్రెయిన్ ప్రయత్నాలకు ఆ దేశానికి అభినందనలు తెలుపుతున్నట్లు భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రకటించారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









