భారత రాయబారితో బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ కార్యదర్శి మీటింగ్
- September 26, 2022
మనామా : బహ్రెయిన్ లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవతో బహ్రెయిన్ పాస్ పోర్ట్, రెసిడెన్సీ, ఇంటీరియర్ వ్యవహారాల శాఖ కార్యదర్శి షేక్ హేషమ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు, పలు రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలను చర్చించారు. రెండు దేశాలు మరింత మెరుగైన సంబంధాల కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. బహ్రెయిన్ లో భారతీయుల సమస్యలు, పాస్ పోర్ట్ అంశాలు, రెసిడెన్షియల్ వ్యవహారాలను భారత రాయబారి ప్రస్తావించారు. ఈ అంశంలో మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందన్నారు. భారత్ తో సంబంధాల విషయంలో అత్యంత ప్రాధాన్యమిస్తున్న బహ్రెయిన్ ప్రయత్నాలకు ఆ దేశానికి అభినందనలు తెలుపుతున్నట్లు భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రకటించారు.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









