పాఠశాల విద్యార్థులను కొట్టినందుకు మహిళకు జరిమానా

- April 18, 2016 , by Maagulf
పాఠశాల విద్యార్థులను కొట్టినందుకు  మహిళకు  జరిమానా

ఒక స్త్రీ తన కుమారునీతో  పోట్లాడిన ఇద్దరు పాఠశాల పిల్లలను కొట్టిన నేరానికి  దోహా నేర న్యాయస్థానం ఆ మహిళకు 5,000 క్యు అర్  మొత్తంగా జరిమానా విధించింది..స్థానిక అరబిక్ డైలీ ఆర్రయహ్ తెలిపిన వివరాల ప్రకారం  స్త్రీ నుండి తన కుమారుడు తీసుకురావడానికి పాఠశాలకు  వెళ్ళినప్పుడు, తన పుత్రుదిపై ఇద్దరు పిల్లలు దాడి చేయడాన్ని గమనించింది. అయితే ఈమె రాకను గమనించిన ఆ ఇరువురు పిల్లలు ఆటస్థలం వైపునకు పారిపోయారు.  వీరిని వెంబడించిన ఆ తల్లి  వారీరువుర్ని పట్టుకని కొట్టింది. కాగా తన్నులు తిన్న ఇద్దరు పిల్లల తల్లులు తమ  పిల్లలపై దాడి ఆమెపై పోలీసులకు పిర్యాదు దాఖలు చేశారు. ఇరువురు బాలురకు  తగిలిన గాయాల విషయంపై  వైద్య నివేదిక ఆధారంగా పోలీసులు మహిళపై కేసు నమోదు చేసి  దోహా నేర న్యాయస్థానంకు అప్పగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com