30 శాతం క్రైమ్ రేటు తగ్గటంపై హర్షం వ్యక్తం చేసిన సమాచార శాఖ మంత్రి

- October 01, 2022 , by Maagulf
30 శాతం క్రైమ్ రేటు తగ్గటంపై హర్షం వ్యక్తం చేసిన సమాచార శాఖ మంత్రి

బహ్రెయిన్:  బహ్రెయిన్ లో గత నాలుగేళ్లలో 30 శాతం క్రైమ్ రేటు తగ్గింది. ఈ అచీవ్ మెంట్ సాధించిన అంతర్గత వ్యవహారాల శాఖ ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ రషీద్ అల్ ఖలీఫా తో పాటు, సిబ్బంది నిరంతర కృషి వల్లనే ఇది సాధ్యమైందంటున్నారు. తాజాగా సమాచార శాఖ మంత్రి డాక్టర్ రంజాన్ బిన్ అబ్దుల్లా సైతం ఈ అంశంపై స్పందించారు. దేశంలో 30 శాతం క్రైమ్ రేటు తగ్గటం ఎంతో సంతోషమన్నారు. విశ్రాంతి లేకుండా నిరంతరం ప్రజల కోసం సిబ్బంది చేసిన త్యాగం కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. క్రైమ్ రేటు తగ్గించేందుకు ప్రత్యేకంగా కృషి చేసిన అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ రషీద్ ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్ లోనూ క్రైమ్ మరింత తగ్గే విధంగా అంతర్గత వ్యవహారాల శాఖ సిబ్బంది, అధికారులు పనిచేయాలని ఆకాంక్షించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com