30 శాతం క్రైమ్ రేటు తగ్గటంపై హర్షం వ్యక్తం చేసిన సమాచార శాఖ మంత్రి
- October 01, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ లో గత నాలుగేళ్లలో 30 శాతం క్రైమ్ రేటు తగ్గింది. ఈ అచీవ్ మెంట్ సాధించిన అంతర్గత వ్యవహారాల శాఖ ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ రషీద్ అల్ ఖలీఫా తో పాటు, సిబ్బంది నిరంతర కృషి వల్లనే ఇది సాధ్యమైందంటున్నారు. తాజాగా సమాచార శాఖ మంత్రి డాక్టర్ రంజాన్ బిన్ అబ్దుల్లా సైతం ఈ అంశంపై స్పందించారు. దేశంలో 30 శాతం క్రైమ్ రేటు తగ్గటం ఎంతో సంతోషమన్నారు. విశ్రాంతి లేకుండా నిరంతరం ప్రజల కోసం సిబ్బంది చేసిన త్యాగం కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. క్రైమ్ రేటు తగ్గించేందుకు ప్రత్యేకంగా కృషి చేసిన అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ రషీద్ ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్ లోనూ క్రైమ్ మరింత తగ్గే విధంగా అంతర్గత వ్యవహారాల శాఖ సిబ్బంది, అధికారులు పనిచేయాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









