30 శాతం క్రైమ్ రేటు తగ్గటంపై హర్షం వ్యక్తం చేసిన సమాచార శాఖ మంత్రి
- October 01, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ లో గత నాలుగేళ్లలో 30 శాతం క్రైమ్ రేటు తగ్గింది. ఈ అచీవ్ మెంట్ సాధించిన అంతర్గత వ్యవహారాల శాఖ ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ రషీద్ అల్ ఖలీఫా తో పాటు, సిబ్బంది నిరంతర కృషి వల్లనే ఇది సాధ్యమైందంటున్నారు. తాజాగా సమాచార శాఖ మంత్రి డాక్టర్ రంజాన్ బిన్ అబ్దుల్లా సైతం ఈ అంశంపై స్పందించారు. దేశంలో 30 శాతం క్రైమ్ రేటు తగ్గటం ఎంతో సంతోషమన్నారు. విశ్రాంతి లేకుండా నిరంతరం ప్రజల కోసం సిబ్బంది చేసిన త్యాగం కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. క్రైమ్ రేటు తగ్గించేందుకు ప్రత్యేకంగా కృషి చేసిన అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ రషీద్ ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్ లోనూ క్రైమ్ మరింత తగ్గే విధంగా అంతర్గత వ్యవహారాల శాఖ సిబ్బంది, అధికారులు పనిచేయాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







