రూల్స్ ఉల్లంఘించే పెంపుడు జంతువుల యాజమానులు 50 రియాల ఫైన్

- October 01, 2022 , by Maagulf
రూల్స్ ఉల్లంఘించే పెంపుడు జంతువుల యాజమానులు 50 రియాల ఫైన్

మస్కట్: బహిరంగ  ప్రదేశాల్లోకి పెంపుడు జంతువులను తీసుకొచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించే వాటి యాజమానులకు ఫైన్ తప్పదని మస్కట్ మున్సిపాలిటీ అధికారులకు హెచ్చరించారు. రూల్స్ పాటించకుండా పెంపుడు జంతువుల కారణంగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే 50 రియాల ఫైన్ వేస్తామన్నారు. కుక్కలు పిల్లులను బయటకు తీసుకొచ్చిన సమయంలో వాటి మలాలను రోడ్డుపైనే వదిలేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యాజమానులను కోరింది. జంతువులకు తప్పనిసరిగా నెక్ బెల్ట్ ఉంచాల్సిందేనని తెలిపింది. వెటర్నరీ డాక్టర్ నుంచి వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ కూడా తప్పనిసరి అని యాజమానులకు తెలిపింది. ఈ రూల్స్ ఉల్లంఘించిన వారికి 50 రియాల ఫైన్ విధించబడుతుందని మున్సిపల్ అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com