ఐఎస్ సిరియాపై యుద్ధం ప్రకటించింది ..
- April 18, 2016
సిరియాపై యుద్ధం ప్రకటిస్తున్నట్టు ఐఎస్ ఉగ్రవాద అనుబంధ సంస్థ జైష్-ఎల్-నస్ర్ ప్రకటించింది. కాగా, ఐరాస భద్రతామండలి 2254వ తీర్మానం ప్రకారం...ఈఏడాది ఫిబ్రవరి 27 నుంచి సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం పట్ల అంగీకారం తెలిపిన సంస్థలకు అమెరికా, రష్యా భద్రతా బలగాలు రక్షణ కల్పిస్తాయి. అయితే, అల్నుస్రా, ఐఎస్ ఉగ్రవాద సంస్థలను ఈ ఒప్పందం నుంచి మినహాయించారు. ఆయా సంస్థలకు చెందిన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని భద్రతా మండలి ఆదేశించింది. అంతేగాకుండా, కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలయ్యేలా చూడాలని అమెరికా, రష్యా దేశాలను కోరింది. ఈ మేరకు ఉల్లంఘనలు నమోదు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందంతో తమకేమీ సంబంధంలేదని, డమాస్కస్ బలగాలపై పోరు కొనసాగించాలని నిర్ణయించామని జైష్-ఎల్-నస్ర్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మొహమ్మద్ రషీద్ సోమవారం రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు. ఇదిలా ఉండగా, జైష్-ఎల్-నస్ర్ ఉగ్రవాద సంస్థ గతేడాది ఆగస్టులో ఆవిర్భవించింది. ఇద్లెబ్, హామా తదితర నగరాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయి. అయితే, ఎఫ్ఎస్ఏ ( ఫ్రీ సిరియన్ ఆర్మీ ) ఆ సంస్థకు సహకరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఏడాది మార్చి 12న కఫ్ర్ నబూదా నగరంలో సిరియా సైనిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానాన్ని జైష్-ఎల్-నస్ర్ ఉగ్రవాదులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









