భారత్ కరోనా అప్డేట్
- October 04, 2022
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.గడిచిన 24గంటల్లో కొత్తగా 1968 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ నుంచి తాజాగా 3,481 మంది కోలుకోగా.. మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 34,598కి చేరాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.94శాతంగా ఉందని, వీక్లీ పాజిటివిటీ రేటు 1.29శాతంగా ఉందని వివరించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4,45,99,466కు పెరగ్గా.. మొత్తం 4,40,36,152 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారితో 5,28,716 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు దేశంలో 218.80కోట్ల కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం









