పార్కింగ్‌లో కొత్త టెక్నాలజీపై చర్చ

- April 19, 2016 , by Maagulf
పార్కింగ్‌లో కొత్త టెక్నాలజీపై చర్చ


స్మార్ట్‌ పార్కింగ్‌ ఖతార్‌ కాన్ఫరెన్స్‌లో, పార్కింగ్‌ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, కొత్తగా వస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై చర్చ జరిగింది. దేశంలో పార్కింగ్‌ ప్రాంతాల్ని టెక్నాలజీతో అనుసంధానం చేయడం, కొత్తగా పార్కింగ్‌ కేంద్రాల్ని పెంచడం, తగిన సౌకర్యాలు కల్పించడంపై చర్చించారు. మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ మరియు ఎన్విరాన్‌మెంట్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, పబ్లిక్‌ వర్క్స్‌ అథారిటీ (అష్గల్‌), ఖతార్‌ రైల్‌ మరియు ఖతార్‌ ఫౌండేషన్‌ ఈ కాన్ఫరెన్స్‌కి హాజరయ్యాయి. పలు ప్రెజెంటేషన్లు, కేస్‌ స్టడీస్‌ మరియు ప్యానెల్‌ డిస్కషన్స్‌తో కాన్ఫరెన్స్‌ జరిగింది. అడ్వాన్స్‌ ఖతార్‌ నేషనల్‌ స్ట్రేటజీస్‌ కోసం స్మార్ట్‌ పార్కింగ్‌ టెక్నాలజీని వినియోగించుకోవడం గురించి ఆసక్తికరమైన చర్చ చోటుచేసుకుంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌, ట్రాన్స్‌పో గ్రూప్‌, కెఇఓ ఇంటర్నేషనల్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సర్వీసెస్‌, ఖతార్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, అరబ్‌ ఇంజనీరింగ్‌ బ్యూరో కుండాల్‌ కతార్‌, జెఫ్‌సన్‌ కాంట్రాక్టింగ్‌ సంస్థల ప్రతినిథులు ఈ రోజు కాన్ఫరెన్స్‌లో ప్రసంగించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com