పార్కింగ్ సమస్యలకు స్మార్ట్ సొల్యూషన్
- April 19, 2016
ఖతార్ మొబిలిటీ ఇన్నోవేషన్స్ సెంటర్ (క్యూఎంఎఐసి), పార్కింగ్ సైట్స్ నుంచి తగినంత సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి, స్మార్ట్ పార్కింగ్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ముందుగా దోహా ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్, సౌద్ వకిఫ్ మరియు పలు షాపింగ్ సెంటర్స్ వద్ద పార్కింగ్ సైట్స్ సమాచారాన్ని సేకరిస్తున్నామని క్యూఎంఐసి సీఈఓ డాక్టర్ అద్నాన్ అబు దయ్యా చెప్పారు. స్మార్ట్ పార్కింగ్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, అప్లికేషన్స్నీ, సేవల్నీ అభివృద్ధి చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని అన్నారు. ఏయే సమయాల్లో ఏయే పార్కింగ్ స్లాట్స్ ఫుల్ అవుతున్నాయి, ఎక్కడ ఖాళీగా ఉంటున్నాయనే సమాచారాన్ని సేకరించి, దాన్ని వినియోగదారులకు చేరవేసేలా స్మార్ట్ పార్కింగ్ విధానం ఉపయోగపడ్తుందని ఆయన చెప్పారు. పార్కింగ్ సమస్యల నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకే స్మార్ట్ పార్కింగ్ విధానాన్ని రూపొందిస్తామని చెప్పారాయన. వాతావరణ పరిస్థితుల ఆదారంగా ఇండోర్ పార్కింగ్ వైపే ఎక్కువగా వాహనదారులు మొగ్గు చూపుతారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







