ఆ రొయ్యల వినియోగంపై నిషేధం విధించిన ఖతార్
- October 08, 2022
దోహా: దిగుమతి రొయ్యల వినియోగంపై ఖతార్ నిషేధం విధించింది. దిగుమతి చేసుకున్న రొయ్యలలో కొంత పరిమాణంలో కలుషితమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు తమ ఫుడ్ లేబొరేటరీల విశ్లేషణలో తేలిందని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో భారత్ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యలను మార్కెట్ నుంచి నిషేధించినట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లలో ఉన్న స్టాకును ఉపసంహరించుకునేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. అలాగే గత మూడు రోజుల్లో మార్కెట్ నుంచి భారత్ భారతీయ రొయ్యలను కొనుగోలు చేసినట్లయితే, దానిని వినియోగించవద్దని మంత్రిత్వ శాఖ వినియోగదారులకు పిలుపునిచ్చింది. ఒకవేళ ఇప్పటికే తిన్న సందర్భంలో గ్యాస్ట్రో-ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని సూచించింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









