ఆ రొయ్యల వినియోగంపై నిషేధం విధించిన ఖతార్
- October 08, 2022
దోహా: దిగుమతి రొయ్యల వినియోగంపై ఖతార్ నిషేధం విధించింది. దిగుమతి చేసుకున్న రొయ్యలలో కొంత పరిమాణంలో కలుషితమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు తమ ఫుడ్ లేబొరేటరీల విశ్లేషణలో తేలిందని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో భారత్ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యలను మార్కెట్ నుంచి నిషేధించినట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లలో ఉన్న స్టాకును ఉపసంహరించుకునేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. అలాగే గత మూడు రోజుల్లో మార్కెట్ నుంచి భారత్ భారతీయ రొయ్యలను కొనుగోలు చేసినట్లయితే, దానిని వినియోగించవద్దని మంత్రిత్వ శాఖ వినియోగదారులకు పిలుపునిచ్చింది. ఒకవేళ ఇప్పటికే తిన్న సందర్భంలో గ్యాస్ట్రో-ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని సూచించింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









