ఆ రొయ్యల వినియోగంపై నిషేధం విధించిన ఖతార్

- October 08, 2022 , by Maagulf
ఆ రొయ్యల వినియోగంపై నిషేధం విధించిన ఖతార్

దోహా: దిగుమతి రొయ్యల వినియోగంపై ఖతార్ నిషేధం విధించింది. దిగుమతి చేసుకున్న రొయ్యలలో కొంత పరిమాణంలో కలుషితమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు తమ ఫుడ్ లేబొరేటరీల విశ్లేషణలో తేలిందని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో భారత్ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యలను మార్కెట్ నుంచి నిషేధించినట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లలో ఉన్న స్టాకును ఉపసంహరించుకునేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. అలాగే గత మూడు రోజుల్లో మార్కెట్ నుంచి భారత్ భారతీయ రొయ్యలను కొనుగోలు చేసినట్లయితే, దానిని వినియోగించవద్దని మంత్రిత్వ శాఖ వినియోగదారులకు పిలుపునిచ్చింది. ఒకవేళ ఇప్పటికే తిన్న సందర్భంలో గ్యాస్ట్రో-ఇంటెస్టినల్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com