నిషేధిత ప్రదేశాల్లో వేట.. 16 మంది పౌరులను అరెస్టు చేసిన సౌదీ
- October 09, 2022
సౌదీ: అనుమతి పత్రం లేకుండా రక్షిత ప్రాంతంలోకి ప్రవేశించి నిషేధిత ప్రదేశాల్లో వేటాడినందుకు 16 మంది పౌరులను అరెస్టు చేసినట్లు ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ కోసం నియమించిన ప్రత్యేక దళాలు వెల్లడించాయి. ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రాయల్ రిజర్వ్, ఇమామ్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్ రాయల్ రిజర్వ్ లలో వేటగాళ్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ప్రత్యేక దళాలు తెలిపాయి. వారి వద్ద నుంచి 6 షాట్గన్లు, 11 ఎయిర్ రైఫిల్స్, 4,870 రౌండ్ల మందుగుండు సామగ్రి, అప్పటికే వేటాడిన 74 వేట పక్షులను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనుమతి లేకుండా రిజర్వ్ ఫారెస్టుల్లోకి ప్రవేశించడం, నిషేధిత ప్రదేశాల్లో వేటాడినందుకు SR 5,000 జరిమానా.. వేటకు షాట్గన్లు, వలలు, ఉచ్చులను ఉపయోగించినందుకు మరో SR100,000 వరకు జరిమానా కింది విధించే అవకాశం ఉందని పర్యావరణ భద్రత కోసం ఏర్పాటైన ప్రత్యేక దళాల ప్రతినిధి కల్నల్ అబ్దుల్రహ్మాన్ అల్-ఒటైబీ తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







