నిషేధిత ప్రదేశాల్లో వేట.. 16 మంది పౌరులను అరెస్టు చేసిన సౌదీ
- October 09, 2022
సౌదీ: అనుమతి పత్రం లేకుండా రక్షిత ప్రాంతంలోకి ప్రవేశించి నిషేధిత ప్రదేశాల్లో వేటాడినందుకు 16 మంది పౌరులను అరెస్టు చేసినట్లు ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ కోసం నియమించిన ప్రత్యేక దళాలు వెల్లడించాయి. ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రాయల్ రిజర్వ్, ఇమామ్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్ రాయల్ రిజర్వ్ లలో వేటగాళ్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ప్రత్యేక దళాలు తెలిపాయి. వారి వద్ద నుంచి 6 షాట్గన్లు, 11 ఎయిర్ రైఫిల్స్, 4,870 రౌండ్ల మందుగుండు సామగ్రి, అప్పటికే వేటాడిన 74 వేట పక్షులను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనుమతి లేకుండా రిజర్వ్ ఫారెస్టుల్లోకి ప్రవేశించడం, నిషేధిత ప్రదేశాల్లో వేటాడినందుకు SR 5,000 జరిమానా.. వేటకు షాట్గన్లు, వలలు, ఉచ్చులను ఉపయోగించినందుకు మరో SR100,000 వరకు జరిమానా కింది విధించే అవకాశం ఉందని పర్యావరణ భద్రత కోసం ఏర్పాటైన ప్రత్యేక దళాల ప్రతినిధి కల్నల్ అబ్దుల్రహ్మాన్ అల్-ఒటైబీ తెలిపారు.
తాజా వార్తలు
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ









