ఇంతకీ విజయ్ దేవరకొండ, రష్మికతో వెళ్లాడా.? లేదా.?
- October 13, 2022
విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నా కలిసి మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మికకు సంబంధించిన న్యూస్ అంటే, నెట్టింట్లో అసలే ట్రెండింగ్ ఆయె.
అలాంటిది వెకేషన్ కోసం మాల్దీవులు వెళ్లారన్న ఈ ప్రచారాన్ని సోషల్ కోడి గొంతెత్తి కూసేసింది. ఎయిర్ పోర్టులో ఈ జంట కెమెరాకి చిక్కారంటూ, దాంతో జంటగా వెకేషన్కి ఈ లవ్ బర్డ్స్ ఎగిరిపోయాయంటూ రకరకాల కథనాలు వేడి వేడిగా వడ్డించేశాయ్ పలు టీవీ ఛానెళ్లు. అందులో నిజమెంతో తెలీదు కానీ, ప్రచారం మాత్రం గుమ్మెత్తిపోయింది.
వెకేషన్లో భాగంగా రష్మిక మండన్నా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఒక్క ఫోటోలోనూ విజయ్తో కలిసి కనిపించలేదు రష్మిక మండన్నా. అయినా కానీ ఆ ప్రచారం ఆగలేదు.
తాజాగా వెకేషన్ పూర్తి చేసుకుని ఈ జంట ఇండియాకి తిరిగొచ్చేసిందంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. ఎయిర్ పోర్టు వరకూ కలిసే వచ్చిన వీడీ, రష్మిక మండన్నా, ఎయిర్ పోర్టు నుంచి సెపరేట్ సెపరేట్గా వచ్చారని అంటున్నారు.
అసలింతకీ రష్మికతో వీడీ వెళ్లాడా.? లేదా.? అన్న గాసిప్కి ఒక్క ప్రూఫ్ కూడా లేదింతవరకూ. కానీ, జరిగిన ప్రచారం మాత్రం అల్టిమేట్. ఒకవేళ జంటగా వెకేషన్ ఎంజాయ్ చేస్తే కనుక, ఈ గుట్టును భలే మెయింటైన్ చేశారులే మన ‘గీత గోవిందం’.!
తాజా వార్తలు
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్న్యూస్..
- గల్ఫ్లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్ఫ్లిక్స్ ఆధిపత్యం
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు







