ఇంతకీ విజయ్ దేవరకొండ, రష్మికతో వెళ్లాడా.? లేదా.?
- October 13, 2022విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నా కలిసి మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మికకు సంబంధించిన న్యూస్ అంటే, నెట్టింట్లో అసలే ట్రెండింగ్ ఆయె.
అలాంటిది వెకేషన్ కోసం మాల్దీవులు వెళ్లారన్న ఈ ప్రచారాన్ని సోషల్ కోడి గొంతెత్తి కూసేసింది. ఎయిర్ పోర్టులో ఈ జంట కెమెరాకి చిక్కారంటూ, దాంతో జంటగా వెకేషన్కి ఈ లవ్ బర్డ్స్ ఎగిరిపోయాయంటూ రకరకాల కథనాలు వేడి వేడిగా వడ్డించేశాయ్ పలు టీవీ ఛానెళ్లు. అందులో నిజమెంతో తెలీదు కానీ, ప్రచారం మాత్రం గుమ్మెత్తిపోయింది.
వెకేషన్లో భాగంగా రష్మిక మండన్నా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఒక్క ఫోటోలోనూ విజయ్తో కలిసి కనిపించలేదు రష్మిక మండన్నా. అయినా కానీ ఆ ప్రచారం ఆగలేదు.
తాజాగా వెకేషన్ పూర్తి చేసుకుని ఈ జంట ఇండియాకి తిరిగొచ్చేసిందంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. ఎయిర్ పోర్టు వరకూ కలిసే వచ్చిన వీడీ, రష్మిక మండన్నా, ఎయిర్ పోర్టు నుంచి సెపరేట్ సెపరేట్గా వచ్చారని అంటున్నారు.
అసలింతకీ రష్మికతో వీడీ వెళ్లాడా.? లేదా.? అన్న గాసిప్కి ఒక్క ప్రూఫ్ కూడా లేదింతవరకూ. కానీ, జరిగిన ప్రచారం మాత్రం అల్టిమేట్. ఒకవేళ జంటగా వెకేషన్ ఎంజాయ్ చేస్తే కనుక, ఈ గుట్టును భలే మెయింటైన్ చేశారులే మన ‘గీత గోవిందం’.!
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు