OMR 22తో ఇండియాకు.. సలామ్ ఎయిర్ బంపరాఫర్
- October 13, 2022
ఒమన్: బడ్జెట్ ఎయిర్లైన్స్ ప్రయాణికులను ఆకర్షించేందుకు ఛార్జీలను తగ్గించడం సర్వసాధారణం. ఒమన్ బడ్జెట్ ఎయిర్లైన్ సలామ్ ఎయిర్ కూడా అదే దారిలో ప్రయాణిస్తోంది. టాక్సీ ఛార్జీలతో సమానమైన రేట్లతో విమాన ప్రయాణం అంటూ కొత్త ఫెయిర్ రేట్లను ప్రకటించింది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముత్రాహకు టాక్సీ ఛార్జీలతో సరిపోయే ధరలను అందిస్తోన్నట్లు తెలిపింది. కేవలం OMR 22 కంటే తక్కువ ఛార్జీలతో సలామ్ ఎయిర్ రెండు గమ్యస్థానాలకు (ఇండియా, ఐరోపా) ప్రమోషనల్ ఛార్జీలను ప్రకటించింది. ప్రముఖ పర్యాటక యూరోపియన్ గమ్యస్థానం, చెక్ రిపబ్లిక్ రాజధాని అయిన ప్రేగ్కు.. దక్షిణ భారత నగరమైన త్రివేండ్రానికి కేవలం OMR 22 కంటే తక్కువ ధరకు ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ అక్టోబర్ 21-28 వరకు చెల్లుబాటు అవుతుందని సలామ్ ఎయిర్ చేసిన ట్వీట్ లో పేర్కొంది. సలామ్ ఎయిర్ ఒమన్లో ఉన్న మొదటి తక్కువ ధర ఎయిర్ క్యారియర్. దీన్ని 2016లో స్థాపించబడింది. తక్కువ-ధర విమానాలు, సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికలు, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గమ్యస్థానాలకు తన సర్వీసులను అందిస్తోంది. సుల్తానేట్లో ఎయిర్బస్ A320neo, A321neo విమానాలను ప్రవేశపెట్టిన మొదటి ఆపరేటర్ కూడా ఇదే. ప్రస్తుతం సలామ్ ఎయిర్ ఫ్లీట్లో ఆరు A320neo, రెండు A321 ఉన్నాయి.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









