వైస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డ్స్ ప్రకటన
- October 14, 2022
ఏపీ: రెండో ఏడాది వైస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్, వైస్సార్ ఎచీవ్మెంట్ అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం అవార్డు గ్రహీతల పేర్లను వెల్లడించింది. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2022 నవంబరు 1న, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. వైస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.10 లక్షల నగదు, వైస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్ (జ్ఞాపిక), శాలువ బహుకరిస్తారు. వైస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ. 5 లక్షల నగదు, వైస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్ (జ్ఞాపిక), శాలువ బహుకరిస్తారు.
కళలు- సంస్కృతి విభాగంలో కళాతపస్వి, సినీ దర్శకుడు కె.విశ్వనాథ్తో పాటు నటుడు ఆర్.నారాయణ మూర్తికి వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక ఇదే రంగంలో రంగస్థల కళాకారుడు నాయుడు గోపి, కళంకారి నేతన్న పిచుక శ్రీనివాస్, షేక్ గౌసియా బేగంలను వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులకు ఎంపిక చేశామని తెలిపింది.
సాహిత్య సేవా విభాగంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ఎమెస్కో ప్రచురణాలయం, రచయిత శాంతి నారాయణలకు వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు దక్కాయి. వ్యవసాయ విభాగంలో ఆదివాసీ కేష్యూనట్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీకి చెందిన సోడెం ముక్కయ్య, కుశలవ కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీకి చెందిన గోపాలకృష్ణ, అన్నమయ్య మూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్కు చెందిన జయబ్బనాయుడు, అమృత ఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీకి చెందిన మౌక్తిక, కట్టమంచి బాలకృష్ణారెడ్డిలు వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులకు ఎంపికయ్యారు.
మహిళా సాధికారత, రక్షణ విభాగం కింద ప్రజ్వలా ఫౌండేషన్కు చెందిన సునీతా కృష్ణన్తో పాటు శిరీష రీహాబిలిటేషన్ సెంటర్, దిశ పోలీసింగ్లను వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దిశ పోలీసింగ్లో ఫిర్యాదు అందిన నిమిషాల్లో స్పందించిన ఐదుగురు పోలీసులకు అచీవ్మెంట్ అవార్డులు దక్కాయి.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









