భారత్లో తయారైన దగ్గు సిరప్లపై హెచ్చరికలు జారీ చేసిన అబుధాబి
- October 15, 2022
అబుధాబి: ఇటీవల గాంబియాలో చిన్నారుల మరణానికి కారణమైన నాలుగు దగ్గు, జలుబు మందులపై(ప్రోమెథాజైన్ నోటి ద్రావణం BP, కోఫెక్స్మలిన్ బేబీ దగ్గు సిరప్, మాకోఫ్ బేబీ, మాగ్రిప్ ఎన్ కోల్డ్) ఎమిరేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ (DoH) హెచ్చరికలు జారీ చేసింది. భారత్ లో తయారైన ఈ దగ్గు, జలుబు మందులను అబుధాబిలో ఎక్కడా విక్రయించడం లేదని డీఓహెచ్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ మందులను కొని వినియోగించే వారు ఏమైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలని డిపార్ట్మెంట్ కోరింది. భారత్కు చెందిన మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు, జలుబు ఔషధాల కారణంగా ఇటీవల ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ దగ్గు మందులు, జలుబు మందుల వినియోగంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ మందుల ఉత్పత్తిపై నిషేధం విధించిన భారత్.. ఆ కంపెనీ ఉత్పత్తులపై దర్యాప్తు ప్రారంభించింది.
తాజా వార్తలు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!
- వేసవిలో ఏసీ అగ్నిప్రమాదాలపై ఫుజైరా హెచ్చరిక..!!
- నాగ్పూర్కు చెందిన నీట్ అభ్యర్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయింపు..!!
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!







