భారత్లో తయారైన దగ్గు సిరప్లపై హెచ్చరికలు జారీ చేసిన అబుధాబి
- October 15, 2022
అబుధాబి: ఇటీవల గాంబియాలో చిన్నారుల మరణానికి కారణమైన నాలుగు దగ్గు, జలుబు మందులపై(ప్రోమెథాజైన్ నోటి ద్రావణం BP, కోఫెక్స్మలిన్ బేబీ దగ్గు సిరప్, మాకోఫ్ బేబీ, మాగ్రిప్ ఎన్ కోల్డ్) ఎమిరేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ (DoH) హెచ్చరికలు జారీ చేసింది. భారత్ లో తయారైన ఈ దగ్గు, జలుబు మందులను అబుధాబిలో ఎక్కడా విక్రయించడం లేదని డీఓహెచ్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ మందులను కొని వినియోగించే వారు ఏమైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలని డిపార్ట్మెంట్ కోరింది. భారత్కు చెందిన మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు, జలుబు ఔషధాల కారణంగా ఇటీవల ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ దగ్గు మందులు, జలుబు మందుల వినియోగంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ మందుల ఉత్పత్తిపై నిషేధం విధించిన భారత్.. ఆ కంపెనీ ఉత్పత్తులపై దర్యాప్తు ప్రారంభించింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









