టర్కీలో బొగ్గుగనిలో భారీ పేలుడు..28 మంది మృతి

- October 15, 2022 , by Maagulf
టర్కీలో బొగ్గుగనిలో భారీ పేలుడు..28 మంది మృతి

టర్కీ: టర్కీలో ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించడం తో 25 మంది మృతి చెందగా , 110 కి పైగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం మీథేన్‌ వాయువు వల్ల ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు లో 28 మంది మృతిచెందగా, 110 మందికిపైగా గాయపడ్డారని , మరో 50 మంది గనిలో చిక్కుకు పోయారని అధికారులు తెలిపారు. 11 మంది క్షేమంగా బయటపడ్డారని వారిని హాస్పటల్ కు తరలించామని చెప్పుకొచ్చారు. ఇక గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెట్టీన్‌ కోకా ట్వీట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com