గడువు ముగిసిన వాహనాలను గుర్తించేందుకు కొత్త రాడార్
- October 16, 2022
యూఏఈ: మసాఫీ రోడ్డులో కొత్త రాడార్ను ఏర్పాటు చేసినట్లు రస్ అల్ ఖైమా పోలీసులు ప్రకటించారు. 2022 అక్టోబర్ 17 నుండి ఈ కొత్త రాడార్ ఉల్లంఘనలకు పాల్పడే ట్రక్కులు, గడువు ముగిసిన వాహనాలను గుర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు అధికార యంత్రాంగం ట్విట్టర్లో ఒక పోస్ట్ ద్వారా రాడార్ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. మసాఫీ రోడ్డులో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఈ రాడార్ను ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ ఆపరేషన్స్ విభాగంలోని ఒక ఉన్నత అధికారి తెలిపారు. పర్మిట్ లేకుండా లేదా అనుమతించబడిన గంటల తర్వాత రహదారిని ఉపయోగించే ట్రక్కుల ఉల్లంఘనలను రాడార్ పర్యవేక్షిస్తుందన్నారు. ఇది గడువు ముగిసిన రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను కూడా గుర్తిస్తుందని వెల్లడించారు. వాహనదారులు తమ వాహన లైసెన్స్ను పునరుద్ధరించుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, వేగ పరిమితులను పాటించాలని రస్ అల్ ఖైమా పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







