గడువు ముగిసిన వాహనాలను గుర్తించేందుకు కొత్త రాడార్
- October 16, 2022
యూఏఈ: మసాఫీ రోడ్డులో కొత్త రాడార్ను ఏర్పాటు చేసినట్లు రస్ అల్ ఖైమా పోలీసులు ప్రకటించారు. 2022 అక్టోబర్ 17 నుండి ఈ కొత్త రాడార్ ఉల్లంఘనలకు పాల్పడే ట్రక్కులు, గడువు ముగిసిన వాహనాలను గుర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు అధికార యంత్రాంగం ట్విట్టర్లో ఒక పోస్ట్ ద్వారా రాడార్ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. మసాఫీ రోడ్డులో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఈ రాడార్ను ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ ఆపరేషన్స్ విభాగంలోని ఒక ఉన్నత అధికారి తెలిపారు. పర్మిట్ లేకుండా లేదా అనుమతించబడిన గంటల తర్వాత రహదారిని ఉపయోగించే ట్రక్కుల ఉల్లంఘనలను రాడార్ పర్యవేక్షిస్తుందన్నారు. ఇది గడువు ముగిసిన రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను కూడా గుర్తిస్తుందని వెల్లడించారు. వాహనదారులు తమ వాహన లైసెన్స్ను పునరుద్ధరించుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, వేగ పరిమితులను పాటించాలని రస్ అల్ ఖైమా పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!
- రాస్ అల్ హర్క్ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!
- 2025లో 574,000 మున్సిపల్ లైసెన్సులు జారీ..!!
- పొగమంచులో ప్రయాణం..డ్రైవర్లకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..పొగమంచు, వర్షాలు..!!
- యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి









