గడువు ముగిసిన వాహనాలను గుర్తించేందుకు కొత్త రాడార్
- October 16, 2022
యూఏఈ: మసాఫీ రోడ్డులో కొత్త రాడార్ను ఏర్పాటు చేసినట్లు రస్ అల్ ఖైమా పోలీసులు ప్రకటించారు. 2022 అక్టోబర్ 17 నుండి ఈ కొత్త రాడార్ ఉల్లంఘనలకు పాల్పడే ట్రక్కులు, గడువు ముగిసిన వాహనాలను గుర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు అధికార యంత్రాంగం ట్విట్టర్లో ఒక పోస్ట్ ద్వారా రాడార్ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. మసాఫీ రోడ్డులో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఈ రాడార్ను ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ ఆపరేషన్స్ విభాగంలోని ఒక ఉన్నత అధికారి తెలిపారు. పర్మిట్ లేకుండా లేదా అనుమతించబడిన గంటల తర్వాత రహదారిని ఉపయోగించే ట్రక్కుల ఉల్లంఘనలను రాడార్ పర్యవేక్షిస్తుందన్నారు. ఇది గడువు ముగిసిన రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను కూడా గుర్తిస్తుందని వెల్లడించారు. వాహనదారులు తమ వాహన లైసెన్స్ను పునరుద్ధరించుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, వేగ పరిమితులను పాటించాలని రస్ అల్ ఖైమా పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్









