లైసెన్స్ లేకుండా ప్రయాణికుల రవాణా: ఆరు ట్యాక్సీలు సీజ్
- October 18, 2022
దుబాయ్: లైసెన్స్ లేకుండా ప్రయాణికులను రవాణా చేస్తున్న ఆరు వాహనాలను(ట్యాక్సీలు) సీజ్ చేసినట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది. దుబాయ్ పోలీస్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) సహకారంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అథారిటీ పేర్కొంది. తనిఖీల్లో భాగంగా అల్ ఘుబైబాలో నిబంధనలు పాటించని 39 రవాణా వాహనాలకు జరిమానాలు విధించినట్లు తెలిపింది. వాటిల్లో 22 ప్రయాణీకుల రవాణా కోసం లైసెన్స్ లేని వాహనాలు, మరో 17 వాహనాలు అలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించినవి ఉన్నాయన్నారు. అదే విధంగా ఉల్లంఘనలకు పాల్పడిన 693 కేసుల్లో జరిమానాలు జారీ చేసినట్లు అథారిటీ పేర్కొంది. ప్రజా రవాణా మోడ్లు, సౌకర్యాలు, సేవలను ఉపయోగించి ఛార్జీలు చెల్లించకుండా ఫేర్ జోన్లలోకి ప్రవేశించడం/నిష్క్రమించడం లాంటివి 591 కేసులు ఉండగా.. నోల్ కార్డ్ను చూపించడంలో విఫలమైనవి మరో 33 ఉన్నాయని ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







