మార్చి 2023 నాటికి 200 నగరాల్లోకి 5G సర్వీసులు..
- October 18, 2022
న్యూ ఢిల్లీ: భారత్లోని కొన్ని నగరాల్లో అక్టోబర్ ప్రారంభంలో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే నెలల్లో మరిన్ని ప్రాంతాల్లోకి 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మార్చి 2023 నాటికి ఒడిశాలోని కనీసం 4 నగరాలు 5G సర్వీసులు రానున్నాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ప్రభుత్వ అధికారి ప్రకారం.. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా పూర్తిగా 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. మొదటి దశలో, ఒడిశాలోని నాలుగు-ఐదు నగరాలు మార్చి 2023 నాటికి 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, వచ్చే ఏడాది చివరి నాటికి, రాష్ట్రంలోని 80 శాతం ప్రాంతం 5G నెట్వర్క్తో నిండిపోతుందని ఆయన చెప్పారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి 200 నగరాలను కవర్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఆపై మరిన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు 5G సర్వీసులను విస్తరించాలని యోచిస్తోందని వైష్ణవ్ తెలిపారు. ఏయే నగరాలు అనేది వాటి పేర్లు ప్రస్తుతానికి తెలియవు. ఈ 5G ప్రారంభంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) 13 ప్రధాన నగరాలు మొదట 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. కానీ, ఇది జరగలేదు. రిలయన్స్ జియో మొదట ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసితో సహా నాలుగు నగరాల్లో మాత్రమే 5G సర్వీసులను అందించింది.
మరోవైపు.. ఎయిర్టెల్ మరిన్ని నగరాల్లో 5Gని అందుబాటులోకి తెచ్చింది. ముంబై, బెంగళూరు, గురుగ్రామ్, కోల్కతా, హైదరాబాద్, ఢిల్లీ, వారణాసి, చెన్నై. టెల్కోలు 5Gకి సిద్ధంగా ఉన్నందున మరిన్ని నగరాల్లో 5Gకి సపోర్టు అందిస్తాయని చెప్పారు. 5G గరిష్టంగా సెకనుకు 20Gbps లేదా సెకనుకు 100Mbps కన్నా ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అందిస్తుంది.
4G సర్వీసుల్లో 1Gbps స్పీడ్ అందిస్తోంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) ఈవెంట్లో నిర్వహించిన టెస్టుల ప్రకారం.. Airtel 5G మాకు 306Mbps డౌన్లోడ్ స్పీడ్, 25.4Mbps అప్లోడ్ స్పీడ్ని అందించింది. మరోవైపు 4G సర్వీసుల్లో 50.5Mbps డౌన్లోడ్, 1.87Mbps అప్లోడ్ స్పీడ్ మాత్రమే అందించింది.
Ookla కంపెనీ 5G ట్రయల్స్లో పొందిన దానితో పోలిస్తే.. అత్యధిక 5G స్పీడ్ రిజల్ట్ కానప్పటికీ, అత్యంత ఇంటర్నెట్ స్పీడ్ పొందవచ్చు. ప్రస్తుతానికి, Vodafone Idea 5G సర్వీసుల గురించి ఎలాంటి వివరాలు లేవు. అన్ని కంపెనీలు ఇంకా 5G ప్లాన్ ధరలను వెల్లడించలేదు. ప్రస్తుతం భారత్ అంతటా టెల్కోలు 5G ట్రయల్స్ను అమలు చేస్తున్నందున సరికొత్త నెట్వర్క్ను ఉచితంగా అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!