నవంబర్ 25న దుబాయ్లో ఇళయరాజా ‘లైవ్ ఇన్ కాన్సర్ట్’
- October 20, 2022
దుబాయ్: ఇండియన్ లెజెండ్ మాస్ట్రో ఇళయరాజా దుబాయ్లోని సిటీ వాక్లోని కోకా-కోలా అరేనాలో నవంబర్ 25న ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు మనో, కార్తీక్, ఉషా ఉదుప్, శ్వేతా మోహన్, యుగేంద్రన్, SPB చరణ్, విభావరి జోషి, ప్రియా హేమేష్, అనితా కార్తికేయ తదితర గాయకులు ఇళయరాజాతో కలిసి లైవ్ ఇన్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. 65 మంది సంగీతకారులు తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ పాటలను ఆలపించనున్నారు. బుక్మీ షో (http://ae.bookmyshow.com)లో టిక్కెట్లు విక్రయించబడతాయని, 2022 అక్టోబర్ 24 నుండి నవంబర్ 6 వరకు తగ్గింపు ధరలతో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు వెల్లడించారు. పద్మవిభూషణ్ ఇళయరాజాను ఇటీవల యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాతో సత్కరించిన విషయం తెలిసిందే. ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ ఈవెంట్ను హాల్స్ స్టూడియోస్ (HALS STUDIOS INC) నిర్వహిస్తోంది. ప్రముఖ సినీ నిర్మాతలు అభిషేక్ ఫిలిమ్స్, రమేష్ పి పిళ్లై, ఇసై రాజాంగం దుబాయ్లో ఈవెంట్ పార్టనర్లుగా వ్యవహారించనున్నారు. మా గల్ఫ్, క్లబ్ ఎఫ్ఎమ్, తమిళ్ ఎఫ్ఎమ్, రేడియో కుషి, మాతృభూమి న్యూస్, ధినతండి, ఖలీజ్ టైమ్స్ లు మీడియా పార్టనర్స్ గా ఉన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







