నవంబర్ 19న ‘విశ్వ కన్నడ హబ్బ’
- October 25, 2022
దుబాయ్: నవంబర్ 19న దుబాయ్లోని షేక్ రషీద్ ఆడిటోరియంలో ‘విశ్వాస్ కన్నడ హబ్బా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కర్ణాటక ప్రెస్ క్లబ్ కౌన్సిల్ (KPCC) తెలిపింది. దుబాయ్లోని ఒమేగా హోటల్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు వారు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని కేపీసీసీతో కలిసి కన్నడిగరు దుబాయ్ నిర్వహించనుంది. అలాగే డాక్టర్ పునీత్ రాజ్కుమార్ పేరు మీద ప్రతి సంవత్సరం.. కన్నడ (సామాజిక, సంస్కృతి, కళ, భాష) రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి "అంతర్జాతీయ కన్నడ రత్న" అవార్డును అందజేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టి.శివకుమార్ నగర నవిలే, కన్నడిగరు దుబాయ్ అధ్యక్షుడు సదన్ దాస్, కేపీసీసీ జీసీసీ ప్రెసిడెంట్, కెపిసిసి రాష్ట్ర కల్చరల్ & ఆర్ట్ ప్రెసిడెంట్ రవి సంతోష్, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి, యూఏఈ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ ఎంకే, జీసీసీ ఉపాధ్యక్షులు దీపక్ సోమశేఖర్, గణేష్ రాయ్, విజయ్ గుజ్జర్ పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









