నవంబర్ 19న ‘విశ్వ కన్నడ హబ్బ’
- October 25, 2022
దుబాయ్: నవంబర్ 19న దుబాయ్లోని షేక్ రషీద్ ఆడిటోరియంలో ‘విశ్వాస్ కన్నడ హబ్బా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కర్ణాటక ప్రెస్ క్లబ్ కౌన్సిల్ (KPCC) తెలిపింది. దుబాయ్లోని ఒమేగా హోటల్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు వారు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని కేపీసీసీతో కలిసి కన్నడిగరు దుబాయ్ నిర్వహించనుంది. అలాగే డాక్టర్ పునీత్ రాజ్కుమార్ పేరు మీద ప్రతి సంవత్సరం.. కన్నడ (సామాజిక, సంస్కృతి, కళ, భాష) రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి "అంతర్జాతీయ కన్నడ రత్న" అవార్డును అందజేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టి.శివకుమార్ నగర నవిలే, కన్నడిగరు దుబాయ్ అధ్యక్షుడు సదన్ దాస్, కేపీసీసీ జీసీసీ ప్రెసిడెంట్, కెపిసిసి రాష్ట్ర కల్చరల్ & ఆర్ట్ ప్రెసిడెంట్ రవి సంతోష్, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి, యూఏఈ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ ఎంకే, జీసీసీ ఉపాధ్యక్షులు దీపక్ సోమశేఖర్, గణేష్ రాయ్, విజయ్ గుజ్జర్ పాల్గొన్నారు.

తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









