క్రికెటర్ ధోనీ నిర్మాణంలో తమిళ సినిమా.!
- October 26, 2022
మాజీ క్రికెటర్ ధోనీ, ఇప్పుడు సినిమాల్లోకీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే యాక్టర్గా కాదండోయ్. ప్రొడ్యూసర్గా. ధోనీ తన భార్య సాక్షితో కలిసి నిర్మాతగా మారనున్నారు. ధోనీ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ని స్థాపించారు.
ఈ బ్యానర్పై అభిరుచి గల సినిమాలను తెరకెక్కించాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఈ నిర్మాణ సంస్థంలో తొలి సినిమాగా ఓ చిన్న సినిమాని రూపొందించాలనుకుంటున్నారట ధోనీ అండ్ టీమ్.
అందులో భాగంగానే ఓ తమిళ సినిమాని ఎంచుకున్నాడు ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్గా ధోనీ ఈ మధ్య తమిళ తంబీలకు బాగా దగ్గరైపోయాడు. అందుకే, తన బ్యానర్లో తొలి సినిమాని తమిళంలోనూ రూపొందించాలనుకుంటున్నాడు.
తమిళ హీరో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా ఓ ఫ్యామిలీ స్టోరీని ఈ బ్యానర్లో తొలి సినిమాగా రూపొందించబోతున్నాడు ధోనీ. ఈ నిర్మాణ సంస్థకి సంబంధించిన టెక్నికల్ అంశాలన్నింటినీ ధోనీ భార్య సాక్షి పర్యవేక్షించనుందట. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుంది.
కాగా, మొదట చిన్న సినిమాతో స్టార్ట్ చేసి, ఆ తర్వాత ప్యాన్ ఇండియా స్థాయి సినిమాలను రూపొందించాలనుకుంటున్నారట ధోనీ అండ్ హిజ్ ప్రొడక్షన్ టీమ్.
తాజా వార్తలు
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!









