క్రికెటర్ ధోనీ నిర్మాణంలో తమిళ సినిమా.!
- October 26, 2022
మాజీ క్రికెటర్ ధోనీ, ఇప్పుడు సినిమాల్లోకీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే యాక్టర్గా కాదండోయ్. ప్రొడ్యూసర్గా. ధోనీ తన భార్య సాక్షితో కలిసి నిర్మాతగా మారనున్నారు. ధోనీ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ని స్థాపించారు.
ఈ బ్యానర్పై అభిరుచి గల సినిమాలను తెరకెక్కించాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఈ నిర్మాణ సంస్థంలో తొలి సినిమాగా ఓ చిన్న సినిమాని రూపొందించాలనుకుంటున్నారట ధోనీ అండ్ టీమ్.
అందులో భాగంగానే ఓ తమిళ సినిమాని ఎంచుకున్నాడు ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్గా ధోనీ ఈ మధ్య తమిళ తంబీలకు బాగా దగ్గరైపోయాడు. అందుకే, తన బ్యానర్లో తొలి సినిమాని తమిళంలోనూ రూపొందించాలనుకుంటున్నాడు.
తమిళ హీరో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా ఓ ఫ్యామిలీ స్టోరీని ఈ బ్యానర్లో తొలి సినిమాగా రూపొందించబోతున్నాడు ధోనీ. ఈ నిర్మాణ సంస్థకి సంబంధించిన టెక్నికల్ అంశాలన్నింటినీ ధోనీ భార్య సాక్షి పర్యవేక్షించనుందట. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుంది.
కాగా, మొదట చిన్న సినిమాతో స్టార్ట్ చేసి, ఆ తర్వాత ప్యాన్ ఇండియా స్థాయి సినిమాలను రూపొందించాలనుకుంటున్నారట ధోనీ అండ్ హిజ్ ప్రొడక్షన్ టీమ్.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







