వృద్ధాప్యంలో ఆర్థిక సాయానికి నిరాకరణ.. 7,400 షేర్లను వెనక్కి తీసుకున్న తండ్రి
- October 27, 2022
యూఏఈ: అబుభాబిలో వృద్ధాప్యంలో తనను పట్టించుకోని పిల్లలపై ఓ తండ్రి కోర్టుకెక్కి విజయం సాధించిండు. తన ఐదుగురు పిల్లల పేరిట 23 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన 7,400 ట్రేడ్ షేర్లను తిరిగిపొందాడు. తాను సంపాదించిన ట్రేడ్ షేర్ల నుండి కొడుకులు లాభం పొందుతున్నా.. తనకు ఆర్థిక సాయం చేసేందుకు నిరాకరించారని కోర్టులో సివిల్ దావా వేశారు. విచారించిన అబుధాబి కోర్ట్ ఆఫ్ అప్పీల్.. తండ్రి కేసును కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన మునుపటి తీర్పును రద్దు చేసింది. తన కొడుకులు, వారి తల్లికి బహుమతిగా ఇచ్చిన వాణిజ్య వాటాలను తిరిగి పొందే హక్కు తండ్రికి ఉందని తీర్పునిచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో విడాకులు తీసుకొని.. మరో పెళ్లి చేసుకున్నానని, తన ఉద్యోగం పోవడంతో ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నానని సదరు తండ్రి కోర్టుకు తెలియజేశారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







