ఇండియన్ ఎంబసీలో ఘనంగా ‘గోవా స్టేట్ ఫెసిలిటేషన్ ఈవెంట్’
- October 27, 2022
కువైట్: భారత రాయబార కార్యాలయం అక్టోబర్ 26న టూరిజం, పెట్టుబడి అవకాశాలపై దృష్టి సారిస్తూ స్టేట్ ఫెసిలిటేషన్ ఈవెంట్ - గోవాను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కువైట్లోని భారత రాయబారి HE సిబి జార్జ్ తరపున ప్రథమ కార్యదర్శి (వాణిజ్యం) డాక్టర్ వినోద్ గైక్వాడ్ హాజరై ప్రతి ఒక్కరికీ స్వాగతం పలికారు. భారతదేశంలోని గోవా అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రమన్నారు. గోవా అందమైన బీచ్లు, అద్భుతమైన నైట్ స్టే, రుచికరమైన ఆహారం, థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్, ఫుట్బాల్తో ప్రపంచ స్థాయి ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉందన్నారు. గోవా సంప్రదాయం, ఆధునికత సమ్మేళనాన్ని కలిగి ఉందన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి భారతదేశాన్ని సందర్శించే పర్యాటకులకు గోవా స్వర్గధామం అన్నారు. గోవా ప్రజల ఆతిథ్యాన్ని ఆస్వాదించడానికి.. ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు అందమైన గోవాను సందర్శించాలని కువైటీలను వినోద్ గైక్వాడ్ కోరారు. ఈ కార్యక్రమంలో గోవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, గోవా ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ ప్రతినిధుల పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో గోవా రాష్ట్రంలోని పర్యాటక రంగానికి సంబంధించిన అనేక ప్రాంతాలను తెలిపే వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గోవా సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







