65 డ్రగ్ ఏజెన్సీలకు SR1.6 మిలియన్ల జరిమానా
- October 29, 2022
సౌదీ: సెప్టెంబర్లో డ్రగ్స్(మందులు) నిల్వలపై నివేదికలు సమర్పించని 65 ఫార్మాస్యూటికల్ ఏజెన్సీలకు జరిమానాలు విధించినట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA)తెలిపింది. ఆయా ఏజెన్సీలు రిజిస్టర్డ్ ఉత్పత్తుల సరఫరాలో కొరత లేదా అంతరాయాన్ని నివేదించడంలో.. అలాగే వాటిలో కొన్ని రిజిస్టర్డ్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను అందించడంలో విఫలమయ్యాయని అథారిటీ పేర్కొంది. ఆమోదించబడిన ఇ-మానిటరింగ్ సిస్టమ్ ఆర్ఎస్డీలో(RSD) 24 ఫ్యాక్టరీలు/ డ్రగ్ ఏజెంట్లు డ్రగ్స్ షార్టేజీపై వివరాలు తెలుపలేదు.. 8 ఔషధ సంస్థలు 12 ఉత్పత్తులను సరఫరా చేయడంలో విఫలమయ్యాయని, 15 సంస్థలు ఆశించిన వాటిని నివేదించడంలో విఫలమైనందుకు వాటిపై చర్యలు తీసుకున్నట్లు అథారిటీ పేర్కొంది. ఫార్మాస్యూటికల్, హెర్బల్ ఫెసిలిటీస్ అండ్ ప్రిపరేషన్స్ లా.. దాని ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్లో నిర్దేశించిన జరిమానాల ప్రకారం ఉల్లంఘించిన సంస్థలపై SR1.6 మిలియన్ల జరిమానా విధించినట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









