మాల్స్, ఈవెంట్లలో కోవిడ్-19 పరిమితుల సడలింపు
- October 29, 2022
యూఏఈ: కోవిడ్-19 ముందుజాగ్రత్త చర్యలను అబుధాబి సడలించింది. వాణిజ్య, పర్యాటక సంస్థలు, ఈవెంట్లలో ఈడీఈ(EDE), థర్మల్ స్కానర్ల వినియోగాన్ని నిలిపివేసింది. అయితే, యూఏఈ రాజధానిలోని షాపింగ్ మాల్స్తో సహా చాలా బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి అల్హోస్న్(AlHosn) యాప్లో గ్రీన్ పాస్ తప్పనిసరి. అబుదాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ సూచనల ప్రకారం తాజా నిర్ణయం తీసుకున్నట్ల అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సంస్థలకు జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది. కాగా.. అబుధాబిలో కొత్త కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో గ్రీన్ పాస్ నిబంధనను కూడా త్వరలోనే సడలించే అవకాశం ఉందని మాల్స్ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో స్థానిక అధికారులు కోవిడ్-19 ప్రోటోకాల్లను సడలించారు.గ్రీన్ పాస్ చెల్లుబాటును 30 రోజులకు పెంచారు. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించడాన్ని ఐచ్ఛికం చేశారు. ఐసోలేషన్ వ్యవధిని ఐదు రోజులకు తగ్గించారు. అబుధాబిలోకి ప్రవేశించే ప్రయాణీకులు, క్రూయిజ్ షిప్ల సిబ్బంది పర్యాటక ఆకర్షణలు, సంస్థలను సందర్శించడానికి గ్రీన్ పాస్ నుండి మినహాయించారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







