మహిళ ద్వారా అవమానపడ్డ వ్యక్తికి 23,000 దిర్హామ్ల పరిహారం
- November 04, 2022
అబుధాబి: వాట్సాప్ ద్వారా ఓ వ్యక్తికి అభ్యంతరకరమైన సందేశాలు పంపిన మహిళకు అబుదాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్ట్ మెట్టికాయలు వేసింది. నష్టపరిహారంగా సదరు వ్యక్తికి 23,000 దిర్హామ్లు చెల్లించాలని ఆదేశించింది. మహిళ నుండి వచ్చిన సందేశాల కారణంగా అనుభవించిన నైతిక, భౌతిక నష్టాలకు పరిహారంగా Dh600,000 చెల్లించాలని ఆ వ్యక్తి మహిళపై దావా వేశారు. వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఆ మహిళ తనను అవమానించిందని, అది తనను మానసికంగా ప్రభావితం చేసిందని ఆ వ్యక్తి తన వ్యాజ్యంలో పేర్కొన్నాడు. అవమానకరమైన సందేశాలు సమాజంలో తన ప్రతిష్టను కూడా దెబ్బతీశాయన్నారు. వ్యక్తిని అవమానించినందుకు, ఆన్లైన్ చట్టాలను ఉల్లంఘించినందుకు దోషిగా తేలిన తర్వాత ఆ మహిళకు అబుదాబి క్రిమినల్ కోర్టు 5,000 దిర్హామ్లు జరిమానా విధించింది. తీర్పును జారీ చేసిన తర్వాత సదరు వ్యక్తి పరిహారం కోసం సివిల్ కోర్టును ఆశ్రయించాడు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









