మహిళ ద్వారా అవమానపడ్డ వ్యక్తికి 23,000 దిర్హామ్ల పరిహారం
- November 04, 2022
అబుధాబి: వాట్సాప్ ద్వారా ఓ వ్యక్తికి అభ్యంతరకరమైన సందేశాలు పంపిన మహిళకు అబుదాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్ట్ మెట్టికాయలు వేసింది. నష్టపరిహారంగా సదరు వ్యక్తికి 23,000 దిర్హామ్లు చెల్లించాలని ఆదేశించింది. మహిళ నుండి వచ్చిన సందేశాల కారణంగా అనుభవించిన నైతిక, భౌతిక నష్టాలకు పరిహారంగా Dh600,000 చెల్లించాలని ఆ వ్యక్తి మహిళపై దావా వేశారు. వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఆ మహిళ తనను అవమానించిందని, అది తనను మానసికంగా ప్రభావితం చేసిందని ఆ వ్యక్తి తన వ్యాజ్యంలో పేర్కొన్నాడు. అవమానకరమైన సందేశాలు సమాజంలో తన ప్రతిష్టను కూడా దెబ్బతీశాయన్నారు. వ్యక్తిని అవమానించినందుకు, ఆన్లైన్ చట్టాలను ఉల్లంఘించినందుకు దోషిగా తేలిన తర్వాత ఆ మహిళకు అబుదాబి క్రిమినల్ కోర్టు 5,000 దిర్హామ్లు జరిమానా విధించింది. తీర్పును జారీ చేసిన తర్వాత సదరు వ్యక్తి పరిహారం కోసం సివిల్ కోర్టును ఆశ్రయించాడు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







