మహిళ ద్వారా అవమానపడ్డ వ్యక్తికి 23,000 దిర్హామ్ల పరిహారం
- November 04, 2022
అబుధాబి: వాట్సాప్ ద్వారా ఓ వ్యక్తికి అభ్యంతరకరమైన సందేశాలు పంపిన మహిళకు అబుదాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్ట్ మెట్టికాయలు వేసింది. నష్టపరిహారంగా సదరు వ్యక్తికి 23,000 దిర్హామ్లు చెల్లించాలని ఆదేశించింది. మహిళ నుండి వచ్చిన సందేశాల కారణంగా అనుభవించిన నైతిక, భౌతిక నష్టాలకు పరిహారంగా Dh600,000 చెల్లించాలని ఆ వ్యక్తి మహిళపై దావా వేశారు. వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఆ మహిళ తనను అవమానించిందని, అది తనను మానసికంగా ప్రభావితం చేసిందని ఆ వ్యక్తి తన వ్యాజ్యంలో పేర్కొన్నాడు. అవమానకరమైన సందేశాలు సమాజంలో తన ప్రతిష్టను కూడా దెబ్బతీశాయన్నారు. వ్యక్తిని అవమానించినందుకు, ఆన్లైన్ చట్టాలను ఉల్లంఘించినందుకు దోషిగా తేలిన తర్వాత ఆ మహిళకు అబుదాబి క్రిమినల్ కోర్టు 5,000 దిర్హామ్లు జరిమానా విధించింది. తీర్పును జారీ చేసిన తర్వాత సదరు వ్యక్తి పరిహారం కోసం సివిల్ కోర్టును ఆశ్రయించాడు.
తాజా వార్తలు
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!







