ఈ నెల 7న రాహుల్ గాంధీ యాత్ర వీడ్కోలు సభ: రేవంత్
- November 04, 2022
హైదరాబాద్: రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈరోజు రాహుల్ తన యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ నెల 07 తో రాహుల్ యాత్ర తెలంగాణాలో పూర్తి అవుతుంది. నెక్స్ట్ మహారాష్ట్ర లో యాత్ర కొనసాగించబోతున్నారు. ఈ క్రమంలో ఈ నెల భారీ వీడ్కోలు సభ ఏర్పాటు చేయబోతుంది టీ కాంగ్రెస్. దీనికి సంబదించిన విషయాలను మీడియా తో పంచుకున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాహుల్ పాదయాత్రకు సంబంధించి నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర ముగియనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణపై వారు చర్చించారు.
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించినా.. దాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు కృషి చేశారని రేవంత్ తెలిపారు. ఈ నెల 5,6 తేదీల్లో మాత్రమే పాదయాత్ర కొనసాగుతుందని, 7న భారీ బహిరంగ సభతో వీడ్కోలు సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతలకు పాదయాత్రలో పాల్గొనే అవకాశం రానందున వారంతా ఈ మూడు రోజులు క్రియాశీల పాత్ర పోషించాలని తెలిపారు. 7వ తేదీ రాత్రి దెగ్లూరులో రాహుల్ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలో అడుగుపెడుతుందని రేవంత్ తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







