శాలిమార్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో చెలరేగిన మంటలు
- November 05, 2022
నాసిక్: శాలిమార్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్ వెనుక ఉండే లగేజ్ కంపార్టుమెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోకోపైలట్ గమనించి రైలును నిలిపేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. లోకోపైలట్ ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న సెంట్రల్ రైల్వే అధికారులు ఇంజిన్ను, రైలులోని ప్రయాణికుల బోగీలను ప్రమాదానికి గురైన లగేజ్ కంపార్టుమెంట్ నుంచి వేరు చేయించారు.
అనంతరం లగేజ్ కంపార్టుమెంట్ను పక్కన వదిలేసి ప్రయాణికుల బోగీలతో రైలును అక్కడి నుంచి పంపించేశారు. మహారాష్ట్రలోని నాసిక్ ఏరియాలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, లగేజ్ కంపార్టుమెంటులో చెలరేగిన మంటలతో ప్రయాణికుల బోగీలకు ఎలాంటి అపాయం వాటిల్లలేదని అధికారులు చెప్పారు.
అయితే, ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందన్న వివరాలు తెలియరాలేదని ముంబైలోని సెంట్రల్ రైల్వేకు చెందిన చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







