జాన్వీ కపూర్ మళ్లీ నో చెప్పేసిందట.! అసలా వుద్దేశ్యం వుందా.? లేదా.?
- November 05, 2022
జాన్వీ కపూర్ని సౌత్ సినిమాల్లోకి తీసుకురావాలని మేకర్లు గత పదేళ్లుగా ప్రయత్నిస్తూనే వున్నారు. కానీ, విఫలమవుతూ వస్తున్నారు. ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా.. అంటోంది కానీ, జాన్వీ బాలీవుడ్ వదిలి రానే రావడం లేదు.
తాజాగా మరోసారి జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీపై చర్చ మొదలైంది. అందుకు కారణం ఆమె నటించిన ‘మిలి’ చిత్రమే. ఈ సినిమా లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జాన్వీ కపూర్ హైద్రాబాద్ వచ్చింది.
ఈ సందర్భంగా కొందరు నిర్మాతలు జాన్వీని కలిశారట. కొన్ని ప్రాజెక్టులు ఆఫర్ చేశారట. కానీ, జాన్వీ సింపుల్గా నో చెప్పేసిందట. ఇప్పటికైతే కుదరదని చెప్పేసిందట. ఇంకెప్పుడు.? అంటే రీజన్లెస్ ఆన్సర్స్ ఇచ్చిందట. దాంతో, విస్తుపోయారట నిర్మాతలు.
ఎన్టీయార్ అంటే తనకు చాలా ఇష్టమనీ, ఎన్టీయార్ సినిమాతో డెబ్యూ చేస్తాననీ, అలాగే రామ్ చరణ్ అన్నా ఇష్టమే అంటూ గతంలో పలు మార్లు చెప్పింది. విజయ్ దేవరకొండ కూడా జాన్వీ లిస్టులో వున్న హీరోనే. అయితే, ఇవన్నీ కేవలం మాటల వరకే. చెప్పే మాటలు వేరు, చేసే పనులు వేరు..అంటూ జాన్వీపై సౌత్ ఆడియన్స్ గుస్సా అవుతున్నారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









