సౌదీ జాతీయ క్రీడల్లో రాణించిన తెలుగు వాసి
- November 07, 2022
సౌదీ: సౌదీ అరేబియా జాతీయ క్రీడల చరిత్రలో తొలిసారిగా బ్యాండ్మీంటన్ బాలుర విభాగంలో నెల్లూరుకు చెందిన 17 ఏళ్ళ మహాద్ స్వర్ణ పతకం గెలుపొందాడు.సౌదీ అరేబియా ఒలింపిక్ కమిటీ ఉపాధ్యక్షుడు, సౌదీ క్రీడల డైరెక్టర్ ప్రిన్స్ ఫహాద్ బిన్ జలవీ బిన్ అబ్దుల్ అజీజ్ చేతులమీదుగా బహుమతి కింద ఒక మిలియన్ రియాల్స్ ( సుమారు రూ. 2,18,60,000) బహుమానాన్ని అందుకున్నాడు. అలాగే బాలికల విభాగంలో కేరళకు చెందిన ఖదీజా కొతూరు అనే బాలిక కూడా స్వర్ణ పతకాన్ని సాధించి రికార్డు సృష్టించింది.
నెల్లూరు నగరం రాంలింగపూర్ వీధికి చెందిన శేఖ్ షాహీద్, షాకీరా బేగంల కుమారుడయిన మహాద్.. ప్రస్తుతం రియాధ్ నగరంలోని భారతీయ యన్.యం.స్.ఇ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నారు. ఈ సందర్భంగా మహాద్ మాట్లాడుతూ.. తన విజయానికి హైదరాబాద్లోని గోపిచంద్ బ్యాండ్మింటెన్ అకాడమీలో శిక్షణ మెళకువలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. సౌదీ అరేబియా పక్షాన ఒలంపిక్స్ పోటీలలో పాల్గొని విజయం సాధించడం తన లక్ష్యం అని తెలిపారు.
మహాద్ తండ్రి షాహీద్ అర్కిటెక్ట్ కాగా.. తల్లి షాకీరా బేగం ఇంజినీరింగ్ పట్టభద్రురాలు. మహాద్ అన్న ఫైసల్ షా కూడా బ్యాండ్మింటన్ క్రీడాకారుడు. ప్రస్తుతం యం.బి.బి.యస్ చదువుతున్నాడు. సోదరి ఖతీజా షాహీద్ కూడా ప్రస్తుతం ఇండియాలో యం.బి.బి.యస్ చదువుతుంది.
తాజా వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!







