నవంబర్ 11న షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కు షారుక్ ఖాన్!
- November 07, 2022
యూఏఈ: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నవంబర్ 11న షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కు అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు షార్జా బుక్ అథారిటీ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రకటించింది. నవంబర్ ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై ఈ బాలీవుడ్ స్టార్ 57వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న మొదటి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ నిలిచాడు. అలాగే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ ద్వారా హ్యాపీనెస్ కార్డ్ను కూడా అందుకున్నాడు. షారూఖ్.. దుబాయ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం ఈజిప్షియన్ నటుడు అహ్మద్ అల్ సక్కా, భారతీయ రచయిత దీపక్ చోప్రా, ఇటాలియన్ రచయిత్రి ఎలిసబెట్టా డామీలు షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ను సందర్శించారు.
తాజా వార్తలు
- ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







