నకిలీ నోట్ల ముద్రణ కేసులో ఆరుగురి అరెస్ట్
- November 08, 2022
జెడ్డా: నకిలీ నోట్ల ముద్రణ, చెలామణి కేసులో ఇద్దరు పౌరులతో సహా నలుగురు ప్రవాసులను అరెస్టు చేసినట్లు సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆర్థిక నేరాల విభాగం వెల్లడించింది. ఈ ముఠా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. విచారణ కోసం కోర్టుకు వారిని రిఫర్ చేయనున్నట్లు తెలిపింది. నోట్లను ముద్రించేందుకు నిందితులు ఎలక్ట్రానిక్ మెషిన్లను ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైందని వివరించింది. నకిలీ నోట్ల ముద్రణ, చెలామణి కేసులో శిక్షా విధానంలోని ఆర్టికల్ టూ ప్రకారం.. నేరస్థులకు 25 సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR500,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







