నకిలీ నోట్ల ముద్రణ కేసులో ఆరుగురి అరెస్ట్

- November 08, 2022 , by Maagulf
నకిలీ నోట్ల ముద్రణ కేసులో ఆరుగురి అరెస్ట్

జెడ్డా: నకిలీ నోట్ల ముద్రణ, చెలామణి కేసులో ఇద్దరు పౌరులతో సహా నలుగురు ప్రవాసులను అరెస్టు చేసినట్లు సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ ఆర్థిక నేరాల విభాగం వెల్లడించింది. ఈ ముఠా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. విచారణ కోసం కోర్టుకు వారిని రిఫర్ చేయనున్నట్లు తెలిపింది. నోట్లను ముద్రించేందుకు నిందితులు ఎలక్ట్రానిక్‌ మెషిన్‌లను ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైందని వివరించింది. నకిలీ నోట్ల ముద్రణ, చెలామణి కేసులో శిక్షా విధానంలోని ఆర్టికల్ టూ ప్రకారం.. నేరస్థులకు 25 సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR500,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com