రూ.972 కోట్ల రిఫండ్ చెల్లించండి.. ఎయిర్ ఇండియా సంస్థకు అమెరికా ఆదేశం
- November 15, 2022
వాషింగ్టన్: అమెరికా ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్.. ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలకు (ఎయిర్ లైన్స్ కంపెనీలు) షాక్ ఇచ్చింది. వాటికి జరిమానాలు విధిస్తూ, టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు చార్జీలను తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా మొత్తం ఆరు ఎయిర్ లైన్స్ కు 7.25 మిలియన్ డాలర్లు (రూ.58 కోట్లు) జరిమానా, 622 మిలియన్ డాలర్లు (రూ.4,960 కోట్లు) ప్రయాణికులకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
వేలాది మంది ప్రయాణికులకు సంబంధించిన ఫ్లైట్లు రద్దు కావడం లేదంటే పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేసినట్టు అమెరికా రవాణా మంత్రి పెటే బట్టీజింగ్ తెలిపారు. కరోనా సమయంలో ఫ్లైట్లు రద్దు కావడం, ఆలస్యం కావడం చోటు చేసుకోగా, అందుకు సంబంధించి చార్జీల రిఫండ్ కోసం ఇప్పటికీ చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీంతో అమెరికా రవాణా విభాగం చర్యలకు దిగింది. టాటాలకు చెందిన ఎయిర్ ఇండియా (గతంలో ప్రభుత్వ రంగ సంస్థ) ఒక్కటే 121.5 మిలియన్ డాలర్లను (రూ.972 కోట్లు) ప్రయాణికులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 1.4 మిలియన్ డాలర్లు జరిమానాగా చెల్లించాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







