రూ.972 కోట్ల రిఫండ్ చెల్లించండి.. ఎయిర్ ఇండియా సంస్థకు అమెరికా ఆదేశం
- November 15, 2022
వాషింగ్టన్: అమెరికా ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్.. ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలకు (ఎయిర్ లైన్స్ కంపెనీలు) షాక్ ఇచ్చింది. వాటికి జరిమానాలు విధిస్తూ, టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు చార్జీలను తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా మొత్తం ఆరు ఎయిర్ లైన్స్ కు 7.25 మిలియన్ డాలర్లు (రూ.58 కోట్లు) జరిమానా, 622 మిలియన్ డాలర్లు (రూ.4,960 కోట్లు) ప్రయాణికులకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
వేలాది మంది ప్రయాణికులకు సంబంధించిన ఫ్లైట్లు రద్దు కావడం లేదంటే పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేసినట్టు అమెరికా రవాణా మంత్రి పెటే బట్టీజింగ్ తెలిపారు. కరోనా సమయంలో ఫ్లైట్లు రద్దు కావడం, ఆలస్యం కావడం చోటు చేసుకోగా, అందుకు సంబంధించి చార్జీల రిఫండ్ కోసం ఇప్పటికీ చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీంతో అమెరికా రవాణా విభాగం చర్యలకు దిగింది. టాటాలకు చెందిన ఎయిర్ ఇండియా (గతంలో ప్రభుత్వ రంగ సంస్థ) ఒక్కటే 121.5 మిలియన్ డాలర్లను (రూ.972 కోట్లు) ప్రయాణికులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 1.4 మిలియన్ డాలర్లు జరిమానాగా చెల్లించాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







