ఒమన్ లో 1,300 పైగా కల్తీ వస్తువులు సీజ్
- November 22, 2022
ఒమన్: నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) మూలికలు, తేనెను విక్రయించే ప్రత్యేక మూడు దుకాణాలపై దాడి చేసింది. ఈ సందర్భంగా 1,300 కంటే ఎక్కువ కల్తీ వస్తువులను స్వాధీనం చేసుకున్నది. నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్, గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ యొక్క ఫార్మాస్యూటికల్ కంట్రోల్ డిపార్ట్మెంట్ సహకారంతో వివిధ గవర్నరేట్లలో అథారిటీ చేపట్టిన తనిఖీల్లో భాగంగా 1,394 గడువు ముగిసిన, అనధికార, కల్తీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ వెల్లడించింది. ఒమన్ సుల్తానేట్ మార్కెట్లను పర్యవేక్షించడం, సరఫరాదారులు చేసే దుర్వినియోగాలను అరికట్టడం, సమాజం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అనధికార వస్తువుల వ్యాప్తిని ఎదుర్కోవడం తమ తనిఖీల లక్ష్యమని అథారిటీ పేర్కొన్నది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఉల్లంఘనల గురించి సమాచారం తెలిస్తే అధికారులకు నివేదించాలని వినియోగదారులకు అథారిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి
- మలేషియాలో ఏపీ వాసి మృతి
- తెలంగాణ: రేపే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక
- పాక్ను చిత్తుగా ఓడించిన భారత్..
- తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!









