ఒమన్ లో 1,300 పైగా కల్తీ వస్తువులు సీజ్
- November 22, 2022
ఒమన్: నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) మూలికలు, తేనెను విక్రయించే ప్రత్యేక మూడు దుకాణాలపై దాడి చేసింది. ఈ సందర్భంగా 1,300 కంటే ఎక్కువ కల్తీ వస్తువులను స్వాధీనం చేసుకున్నది. నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్, గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ యొక్క ఫార్మాస్యూటికల్ కంట్రోల్ డిపార్ట్మెంట్ సహకారంతో వివిధ గవర్నరేట్లలో అథారిటీ చేపట్టిన తనిఖీల్లో భాగంగా 1,394 గడువు ముగిసిన, అనధికార, కల్తీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ వెల్లడించింది. ఒమన్ సుల్తానేట్ మార్కెట్లను పర్యవేక్షించడం, సరఫరాదారులు చేసే దుర్వినియోగాలను అరికట్టడం, సమాజం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అనధికార వస్తువుల వ్యాప్తిని ఎదుర్కోవడం తమ తనిఖీల లక్ష్యమని అథారిటీ పేర్కొన్నది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఉల్లంఘనల గురించి సమాచారం తెలిస్తే అధికారులకు నివేదించాలని వినియోగదారులకు అథారిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు







