బహ్రెయిన్ లో ఏపీ యువతి కష్టాల నుండి విముక్తి...

- November 22, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో ఏపీ యువతి కష్టాల నుండి విముక్తి...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని రావులపాలెంకు చెందిన 32 ఏళ్ళ జి.దుర్గ యువతి బహ్రెయిన్ లో తనను తీసుకు వెళ్లిన ఏజెంట్ సరిగ్గా చూడటం లేదు, ఏసీ లేని రేకుల షెడ్ లో ఉంచారు.తిరిగి ఇండియా పంపాలంటే రెండు లక్షలు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని తన కుటుంబం అంత చెల్లించుకో లేదని, తిరిగి వచ్చేస్తానని  సహకరించమని లెర్న్ అరబిక్ యూట్యూబర్ నరేష్ ద్వారా గల్ఫ్ జె ఏ సి ఉపాధక్షుడు గంగుల మురళీధర్ రెడ్డి ని కోరారు. 

ఈ నెల 19న కేంద్ర ప్రభుత్వ  మదద్ పోర్టల్ లో ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదులో జి.దుర్గ  ఏమైగ్రేట్ సిస్టమ్ ఫాలో కాకుండా ప్రవాసీ భారత బీమా పాలసీ లేకుండా వెళ్లిందని తెలియజేసారు మరియు తనకు నాలుగు రోజుల నుంచి భోజనం లేదని తలుపు తాళం వేశారు.ఫోన్ లాక్కుంటామని చెప్పారని తెలిసి వెంటనే ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ సొసైటీ  (APNRTS) అధికారులు,బహ్రెయిన్ స్థానిక APNRTS మరియు తెలుగు కళా సమితి సభ్యులు ఎం.బి రెడ్డి, హరిబాబు,మురళి నోముల తనకు సహకరించారు. కువైట్ APNRTS టీం పర్యవేక్షణలో తాను ఇంటికి చేరగలిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com