పబ్లిక్ పార్కులో విద్యార్థిని పై పడిన ఊయల: Dh700,000 పరిహారం
- November 22, 2022
అబుధాబి: అల్ ఐన్లోని పబ్లిక్ పార్క్లో ఆడుతుండగా తలపై ఊయల పడి తీవ్రంగా గాయపడిన బాలిక కుటుంబానికి నష్టపరిహారంగా 700,000 దిర్హామ్లు చెల్లించాలని అల్ ఐన్ అప్పీల్స్ కోర్టు.. పార్క్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే బాలిక తండ్రికి న్యాయపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని పార్క్ మేనేజ్మెంట్ ను కోర్టు ఆదేశించింది. దిగువ కోర్టు జారీ చేసిన మునుపటి తీర్పును సమర్థించిన అప్పీల్స్ కోర్ట్ న్యాయమూర్తి పరిహారం మొత్తాన్ని Dh400,000 నుండి Dh700,000కి పెంచారు.
కోర్టు ఫైల్స్ ప్రకారం.. అల్ ఐన్లోని పబ్లిక్ పార్క్ నిర్వహణ బాధ్యతలు చూసే పార్క్ మేనేజ్మెంట్ పై బాలిక తండ్రి దావా వేశారు. బాలికకు జరిగిన భౌతిక, నైతిక నష్టానికి నష్టపరిహారంగా 3 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె అల్ అయిన్లోని పబ్లిక్ పార్క్లో స్కూల్ ట్రిప్కు వెళ్లినప్పుడు ఊయల పడిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో తన కుమార్తె తలకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. ప్రమాదం కారణంగా తన కూతురు… జ్ఞాపకశక్తి లోపాలు, మతిమరుపు, తరచుగా తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం, మానసిక స్థితి తదితర సమస్యలతో ఇబ్బందులు పడిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ పై OpenAI సీఈవో సామ్ అల్ట్మన్ ప్రశంసలు
- డేటా సెంటర్లతో భారీ ఉపాధి: ప్రధాని మోదీ
- దోహాలో ఖతార్ రోబోటిక్స్ AI కాంపిటీషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ - దమ్మామ్ మధ్య హెలికాప్టర్ సర్వీస్..!!
- ‘సహ్ల్’ యాప్ లో సాలరీ డిడక్షన్ నోటిఫికేషన్..!!
- ఒమన్లో వరుస నేరాలు..పలువురు అరెస్టు..!!
- సౌదీ అరేబియాలో స్కూల్స్ టైమింగ్స్ ఛేంజ్..!!
- యూఏఈ 'రాయల్ ఫోటోగ్రాఫర్' రమేష్ శుక్లా కన్నుమూత..!!
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి









