మోసం చేసే చంద్రబాబుకు మళ్లీ అధికారాన్ని ఇవ్వొద్దుః సిఎం జగన్
- November 23, 2022
అమరావతి: సిఎం జగన్ నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబులా తాను దుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదని… దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందా, లేదా అనేదే కొలమానంగా పెట్టుకోవాలని… మీకు మంచి జరిగితే మీ బిడ్డనైన తనకు అండగా ఉండాలని ప్రజలను కోరారు.
తనకు తాను పార్టీ పెట్టుకుని వచ్చిన వారిని ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారని… కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేసిన వాళ్లను చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు మాయ మాటలు చెప్పి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటని అన్నారు. మోసం చేసే చంద్రబాబుకు మళ్లీ అధికారాన్ని ఇవ్వొద్దని చెప్పారు.
అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వేను చేపడుతున్నామని జగన్ తెలిపారు. 17 వేలకు పైగా గ్రామాల్లో భూముల సర్వే చేస్తున్నామని చెప్పారు. తొలి దశలో 2 వేల గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందని తెలిపారు. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలను అందించామని చెప్పారు. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సర్వే పూర్తవుతుందని తెలిపారు. సర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను నియమించామని… రూ. 1,000 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల్లోనే జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







