ఏపీకి కొత్త పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు
- November 24, 2022అమరావతి: ఏపీకి కొత్త పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు ను నియమించారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలను అధిష్టానం నియమించింది. ఇప్పుడున్న శైలజానాథ్ ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో రుద్రరాజుకు అవకాశం ఇచ్చింది. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీని నియమిస్తూ.. ఏఐసీసీ బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది.
ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన గిడుగు రుద్రరాజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. సౌమ్యుడు, వివాహ రహితుడిగా పేరుంది. పార్టీలో సీనియర్ నేత. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్తో పాటు కేవీపీకు సన్నిహితుడిగా మెలిగారు. చిన్నతనం నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగిన గిడుగు రుద్రరాజు..పార్టీకు అత్యంత విధేయుడు.
ఇక కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఏపీలో కూడా నాయకత్వాన్ని పూర్తిగా మార్చేశారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన