ఏపీకి కొత్త పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు
- November 24, 2022
అమరావతి: ఏపీకి కొత్త పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు ను నియమించారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలను అధిష్టానం నియమించింది. ఇప్పుడున్న శైలజానాథ్ ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో రుద్రరాజుకు అవకాశం ఇచ్చింది. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీని నియమిస్తూ.. ఏఐసీసీ బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది.
ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన గిడుగు రుద్రరాజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. సౌమ్యుడు, వివాహ రహితుడిగా పేరుంది. పార్టీలో సీనియర్ నేత. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్తో పాటు కేవీపీకు సన్నిహితుడిగా మెలిగారు. చిన్నతనం నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగిన గిడుగు రుద్రరాజు..పార్టీకు అత్యంత విధేయుడు.
ఇక కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఏపీలో కూడా నాయకత్వాన్ని పూర్తిగా మార్చేశారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







