నవంబర్ 27 నుండి అర్ధ ఒంటెల రేసులు ప్రారంభం
- November 24, 2022మస్కట్: రాయల్ కామెల్ కార్ప్స్ (RCC) నిర్వహించే అర్ధా ఒంటెల రేసులు నవంబర్ 27న విలాయత్ బర్కాలోని అల్ ఫెలైజ్లో ప్రారంభమవుతాయి. మూడు రోజులపాటు ఈ రేసులు జరుగనున్నాయి. గతంలో వలీ కార్యాలయాల్లో నమోదు చేసుకున్న థానయా, హేయెల్ వర్గాలకు చెందిన స్వచ్ఛమైన ఒమానీ అర్ధ ఆడ ఒంటెలకు మాత్రమే రేస్ లో భాగస్వామ్యం ఉంటుందని ఆర్సీసీ తెలిపింది. అర్ధా అనేది రెండు ఒంటెలు తమ రైడర్లతో కొద్ది దూరం పక్కపక్కనే పరుగెత్తే రేసు.
ఆదివారం ఉదయం మస్కట్, సీబ్, రుస్తాక్, ముసన్నా, అల్ అవబి, వాడి అల్ మావిల్, నఖ్ల్, యంకుల్, మహ్దా, అల్ బురైమి, లివా, షినాస్, సోహర్, ఇబ్రి, ధంక్ విలాయత్లతో రేసులు ప్రారంభం అవుతాయి. అలాగే మధ్యాహ్నం సెషన్ ఖబురా, విలాయత్ లలో ప్రారంభం అవుతాయి.
సోమవారం ఉదయం సెషన్ బిదియా, సుర్, వాడి బనీ ఖలీద్, అల్ ఖబిల్, ముదైబి, దిమా వా అల్ తయిన్, బర్కా, జలాన్ బనీ బు హసన్, జలాన్ బనీ బు అలీ, అల్ కమిల్ వా అల్ వాఫీ, ఇబ్రా విలాయాత్లలో రేసులు ఉంటాయి. , మధ్యాహ్నం సెషన్ సువైక్, సమైల్, బిదియా విలాయత్లలో నిర్వహిస్తారు. చివరి రోజు సహమ్ విలాయత్ అర్ధ ఒంటెల రేసులు నిర్వహించనున్నారు. ఒమన్ సుల్తానేట్ 2018లో గుర్రం, ఒంటె అర్ధాను యునెస్కో ఇంటాంజిబుల్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో నమోదు చేయించడంలో విజయం సాధించింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం