నవంబర్ 27 నుండి అర్ధ ఒంటెల రేసులు ప్రారంభం
- November 24, 2022
మస్కట్: రాయల్ కామెల్ కార్ప్స్ (RCC) నిర్వహించే అర్ధా ఒంటెల రేసులు నవంబర్ 27న విలాయత్ బర్కాలోని అల్ ఫెలైజ్లో ప్రారంభమవుతాయి. మూడు రోజులపాటు ఈ రేసులు జరుగనున్నాయి. గతంలో వలీ కార్యాలయాల్లో నమోదు చేసుకున్న థానయా, హేయెల్ వర్గాలకు చెందిన స్వచ్ఛమైన ఒమానీ అర్ధ ఆడ ఒంటెలకు మాత్రమే రేస్ లో భాగస్వామ్యం ఉంటుందని ఆర్సీసీ తెలిపింది. అర్ధా అనేది రెండు ఒంటెలు తమ రైడర్లతో కొద్ది దూరం పక్కపక్కనే పరుగెత్తే రేసు.
ఆదివారం ఉదయం మస్కట్, సీబ్, రుస్తాక్, ముసన్నా, అల్ అవబి, వాడి అల్ మావిల్, నఖ్ల్, యంకుల్, మహ్దా, అల్ బురైమి, లివా, షినాస్, సోహర్, ఇబ్రి, ధంక్ విలాయత్లతో రేసులు ప్రారంభం అవుతాయి. అలాగే మధ్యాహ్నం సెషన్ ఖబురా, విలాయత్ లలో ప్రారంభం అవుతాయి.
సోమవారం ఉదయం సెషన్ బిదియా, సుర్, వాడి బనీ ఖలీద్, అల్ ఖబిల్, ముదైబి, దిమా వా అల్ తయిన్, బర్కా, జలాన్ బనీ బు హసన్, జలాన్ బనీ బు అలీ, అల్ కమిల్ వా అల్ వాఫీ, ఇబ్రా విలాయాత్లలో రేసులు ఉంటాయి. , మధ్యాహ్నం సెషన్ సువైక్, సమైల్, బిదియా విలాయత్లలో నిర్వహిస్తారు. చివరి రోజు సహమ్ విలాయత్ అర్ధ ఒంటెల రేసులు నిర్వహించనున్నారు. ఒమన్ సుల్తానేట్ 2018లో గుర్రం, ఒంటె అర్ధాను యునెస్కో ఇంటాంజిబుల్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో నమోదు చేయించడంలో విజయం సాధించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







