Dh20 మిలియన్ల జాక్పాట్ గెలుచుకున్న భారతీయ ఇంజినీర్
- November 24, 2022
యూఏఈ: 48 ఏళ్ల ఓ భారతీయ మెకానికల్ ఇంజినీర్ దలీప్.. 20 మిలియన్ దిర్హామ్ల మహ్జూజ్ జాక్పాట్ ని గెలుచుకున్నాడు. కువైట్లోని స్టీల్ ఫ్యాక్టరీలో పని చేసే దలీప్.. ఇంత పెద్దమొత్తంలో జాక్ పాట్ వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. 12, 24, 31, 39, 49 నంబర్లతో గేమ్లో చేరిన తనకు విజయం వరించిందని సంతోషం వ్యక్తం చేశారు. 48 ఏళ్ల దలీప్ ఇప్పుడు తన రిటైర్మెంట్ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే డబ్బుతో భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లోని తన స్వస్థలంలో ఒక భవనాన్ని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. అన్నింటికంటే ముందు ప్రైజ్ మనీతో సరికొత్త ఐఫోన్ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే తన కుటుంబంతో కలిసి ప్రపంచ టూర్ కి వెళతానన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







