Dh20 మిలియన్ల జాక్పాట్ గెలుచుకున్న భారతీయ ఇంజినీర్
- November 24, 2022
యూఏఈ: 48 ఏళ్ల ఓ భారతీయ మెకానికల్ ఇంజినీర్ దలీప్.. 20 మిలియన్ దిర్హామ్ల మహ్జూజ్ జాక్పాట్ ని గెలుచుకున్నాడు. కువైట్లోని స్టీల్ ఫ్యాక్టరీలో పని చేసే దలీప్.. ఇంత పెద్దమొత్తంలో జాక్ పాట్ వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. 12, 24, 31, 39, 49 నంబర్లతో గేమ్లో చేరిన తనకు విజయం వరించిందని సంతోషం వ్యక్తం చేశారు. 48 ఏళ్ల దలీప్ ఇప్పుడు తన రిటైర్మెంట్ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే డబ్బుతో భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లోని తన స్వస్థలంలో ఒక భవనాన్ని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. అన్నింటికంటే ముందు ప్రైజ్ మనీతో సరికొత్త ఐఫోన్ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే తన కుటుంబంతో కలిసి ప్రపంచ టూర్ కి వెళతానన్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- 2031 నాటికి మొబైల్ మార్కెట్లో 5G రాజ్యం
- భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్
- నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగింది







