Dh20 మిలియన్ల జాక్పాట్ గెలుచుకున్న భారతీయ ఇంజినీర్
- November 24, 2022
యూఏఈ: 48 ఏళ్ల ఓ భారతీయ మెకానికల్ ఇంజినీర్ దలీప్.. 20 మిలియన్ దిర్హామ్ల మహ్జూజ్ జాక్పాట్ ని గెలుచుకున్నాడు. కువైట్లోని స్టీల్ ఫ్యాక్టరీలో పని చేసే దలీప్.. ఇంత పెద్దమొత్తంలో జాక్ పాట్ వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. 12, 24, 31, 39, 49 నంబర్లతో గేమ్లో చేరిన తనకు విజయం వరించిందని సంతోషం వ్యక్తం చేశారు. 48 ఏళ్ల దలీప్ ఇప్పుడు తన రిటైర్మెంట్ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే డబ్బుతో భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లోని తన స్వస్థలంలో ఒక భవనాన్ని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. అన్నింటికంటే ముందు ప్రైజ్ మనీతో సరికొత్త ఐఫోన్ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే తన కుటుంబంతో కలిసి ప్రపంచ టూర్ కి వెళతానన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







