రాహుల్తో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ
- November 24, 2022
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఎంపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రాహుల్తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో గురువారం ఉదయం ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి అడుగులేస్తూ.. ప్రియాంక కార్యకర్తల్లో మరింత జోష్ పెంచారు. కాగా.. తమిళనాడు కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా కొనసాగి బుధవారం మధ్యప్రదేశ్లోకి అడుగుపెట్టింది. అయితే, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు, పార్టీ వరుస కార్యక్రమాల వల్ల ప్రియాంక గాంధీ ఇంతకాలం భారత్ జోడో యాత్రలో పాల్గొనలేకపోయారు. తాజాగా.. మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న యాత్రలో పాల్గొని ప్రియాంక కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపారు.
ఎంపీలో గురువారం బోర్గాన్ గ్రామం నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఖర్గోన్కు వెళ్లే ముందు స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజనుల ఐకాన్ అయిన తాంతియా భీల్ జన్మస్థలాన్ని రాహుల్, కాంగ్రెస్ నేతలు సందర్శించనున్నారు.
తాజా వార్తలు
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- 2031 నాటికి మొబైల్ మార్కెట్లో 5G రాజ్యం
- భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్
- నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగింది
- 'ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోంది'
- పోలీస్ శాఖ కోసం రూ.600 కోట్లను మంజూరు చేసిన సీఎం రేవంత్ ప్రభుత్వం
- ఆగని పైరసీ..కొత్తగా ఐబొమ్మ వన్
- నలుగురు కీలక నిందితుల అరెస్ట్
- తెలంగాణ సీఎం కు చిత్రపటాన్ని బహుకరించిన చిత్రకారుడు సోమశేఖర్
- నాన్ బహ్రెయిన్ వీడోస్ బీమా స్థితి పై అధ్యయనం..!!







